తెలంగాణ ప్రభుత్వ ఉగాది పంచాంగం.. ఆ శాఖ మంత్రికి చిక్కులు తప్పవట
హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సిద్ధాంతి బాచంపల్లి సంతోష్కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేస్తూ.. ‘పరాభవ’ నామ సంవత్సరంలో ధర్మాత్ములకు విజయం వరిస్తుందని తెలిపారు. ఈ ఏడాది వ్యవసాయం, సంక్షేమం బాగుంటుందని, అయితే ఆర్థిక నిర్వహణలో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందని, పాలకులు సమన్వయంతో ఉండాలని ఆయన పేర్కొన్నారు.
హైలైట్:
తెలంగాణ ప్రభుత్వ ఉగాది పంచాంగం
ఆ శాఖ మంత్రికి చిక్కులు తప్పవట
పంచాంగ శ్రవణంలో పండితులు
Revanth Reddy
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. పరాభవ నామ సంవత్సరం పేరు వినగానే భయపడాల్సిన పని లేదని అధర్మాత్ములకు పరాభవం.. నీతిగా ఉండే ధర్మాత్ములకు ప్రాభవమే పరాభవన నామసంవత్సరమని అన్నారు.నఈ ఏడాది పరిపాలనలో ప్రజా సంక్షేమం, భూమి, వ్యవసాయం మొదలైన అంశాల్లో ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పారు.
గ్రామీణాభివృద్ధి, వ్యవసాయరంగం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. ఆర్థిక వ్యవహారాల్లో కొత్త జాగ్రత్త పడాల్సి ఉంటుందని ఈ ఏడాది ఆర్థిక శాఖను చూసే మంత్రికి చిక్కు ఉందన్నారు. ఆర్థక విషయాల్లో కఠిన నిర్ణయాలు ఉంటేనే పరిపాలన సవ్యంగా ఉంటుందన్నారు. లేకుంటే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని శాస్త్రం చెబుతోందని అన్నారు. ఆరోగ్యశాఖలో కొంత అద్భుతమైన ప్రక్షాళన జరుగుతుందన్నారు. ప్రజావైద్యం కోసం మంత్రులంతా కంకణం కట్టుకుంటారని.. ఒప్పందాలు, ఇతర రాష్ట్రాలతో నీటి పంపకాల వ్యవహరాల్లో జాగ్రత్తగా అడుగులు వేయాల్సి వస్తుందని చెప్పారు.
‘ఈ పరాభవనామ సంవత్సరం ఆధిపత్యం కోసం పోరాటాలు జరుగుతాయి. పరిపాలనలో రాజుకు మంత్రులకు మధ్య పోరాటాలు ఉంటాయి. ఆధిపత్యాన్ని కోరుకునే వారు ఎక్కువవుతారు. కానీ ధర్మంగా ఉన్నవారు కచ్చితంగా నిలబడి విజయం సాధిస్తారు. ఈ ఏడాది నదులు పుష్కలంగా ప్రవహిస్తూ తెలంగాణను వ్యవసాయ తల్లిగా మార్చి అందరికి కడుపునిండా అన్నం పెట్టి రైతులందరికీ ఆనందం పంచే సంవత్సరంగా ఉండబోతుంది. ఈ ఏడాది గురువే రాజుగా ఉన్నారు కాబట్టి ఎప్పుడు మంచిగా ఆలోచించే వారు, మంచి చేయడానికి కంకణం కట్టుకోవడం, నిరంతరం ధర్మాన్ని కాపాడటానికి అస్మదీయులను సైతం పక్కన పట్టి ధర్మనిరంకుశత్వం ఉంటే రాజుకు ఈ సంవత్సరం తిరుగు లేదు.
ఈ ఏడాది నొసట చిరునవ్వులు ఉంటే లోపల అంతా వేరే రకంగా ఉంటుంది. అందువల్ల పాలకుల మధ్య నిత్యం సయోధ్య పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదే నోటిపై కనిపించే చిరునవ్వులను చూసి ఉప్పొంగిపోవద్దు. లోపల చూసి ఆలోచన చేయాలి. ఈ ఏడాది పాడి పంటలు బాగున్నాయి. వర్షాలు బాగున్నాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మెరుగుపడబోతోంది. రుణాలు చేసి భూములు కొనుగోవద్దు. ఖర్చులు అదుపులో పెట్టుకున్న వారికే ఈ సంవత్సంరం బాగుటుంది. ఇక ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 50 డిగ్రీలు అనేది సాధారణం అయిపోతుంది.’ అని పంచాంగ శ్రవణంలో వెల్లడించారు.
నారా లోకేష్ పూజ గదిలో వింత బొమ్మ.. క్షుద్ర...
March 21, 2026