పెంపుడు పిల్లి మరణం తట్టుకోలేక.. పురుగుల మందు తాగి డిగ్రీ యువతి ఆత్మహత్య

 పెంపుడు పిల్లి మరణం తట్టుకోలేక.. పురుగుల మందు తాగి డిగ్రీ యువతి ఆత్మహత్య

పెంపుడు పిల్లి మరణం తట్టుకోలేక.. పురుగుల మందు తాగి డిగ్రీ యువతి ఆత్మహత్య

ఇంట్లో ఇష్టంగా పెంచుకుంటున్న పిల్లి చనిపోయింది. అయితే దాన్ని ప్రేమగా చూసుకున్న యువతి తట్టుకోలేకపోయింది. ఆ పిల్లి లేకపోవడంతో ఇంట్లో ఏదో వెలితిగా ఉందని భావించింది. తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువతి.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు. దీంతో ఆ కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది.

Cat Dead

పిల్లి మరణం తట్టుకోలేక యువతి ఆత్మహత్య

పెంపుడు జంతువులను చాలా మంది ఇళ్లల్లో పెంచుకుంటూ ఉంటారు. సాధారణంగా కుక్కలు, పిల్లలు, కొన్ని పక్షులను చాలా మంది ఇళ్లకు తెచ్చుకుని వాటిని సాకుతూ ఉంటారు. కేవలం వాటిని పెంపుడు జంతువులుగా మాత్రమే కాకుండా.. ఇంట్లో సొంత మనిషిగా వాటిని చూసుకుంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే మనుషుల కంటే ఎక్కువ ప్రేమను వాటిపై చూపిస్తూ ఉంటారు. వాటి ఆహారం, ఇతర సౌకర్యాల కోసం నెలకు వేలకు వేల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు. ఇక ఎక్కడికి వెళ్లినా ఆ పెంపుడు జంతువులను కూడా తీసుకెళ్తూ ఉంటారు. ఎవరైనా వాటిని ఏమైనా అంటే చాలు.. తమను అన్నంతలా ఫీల్ అయిపోతూ ఉంటారు.

ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలో ఓ విషాద ఘటన జరిగింది. పెంపుడు పిల్లి మరణాన్ని తట్టుకోలేని ఓ డిగ్రీ యువతి బలవన్మరణానికి పాల్పడింది. మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్ పేట్ వెంకటాద్రి నివాస్‌లో హిమబిందు అనే 20 ఏళ్ల యువతి నివసిస్తోంది. ఆమె ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. అయితే గత 2 ఏళ్లుగా హిమబిందు తన ఇంట్లో ఒక పిల్లిని పెంచుకుంటోంది. చాలా ఇష్టంగా, ప్రేమగా ఆ పిల్లిని హిమబిందు చూసుకునేది. దీంతో వారిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది.

ఈ క్రమంలోనే ఇటీవలె ఆ పెంపుడు పిల్లి చనిపోయింది. ఆ పిల్లి మృతి చెందడాన్ని తట్టుకోలేని హిమబిందు.. ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే అది గమనించిన హిమబిందు కుటుంబ సభ్యులు.. వెంటనే ఆమెను దగ్గర్లో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే హిమబిందును పరిశీలించిన డాక్టర్లు.. ఆమె చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఈ విషయం కాస్తా మీర్‌పేట్ పోలీసులకు తెలియడంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. హిమబిందు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

అయితే ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు నెటిజన్లు.. హిమబిందు తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. అవి జంతువులు అని.. ఎంత ప్రేమ ఉన్నా.. ఏదో ఒక రోజు అవి చనిపోవాల్సిందేనని పేర్కొంటున్నారు. ఒకటి చనిపోతే ఇంకో పిల్లిని తీసుకువచ్చి పెంచుకోవచ్చు కానీ.. ఇలా ప్రాణాలు తీసుకోవడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం.. అవి కేవలం జంతువులే కానీ.. ఒకసారి వాటితో బంధం ఏర్పడితే మనుషుల కంటే ఎక్కువగా ప్రేమిస్తామని చెబుతున్నారు. కానీ ఆమె పిల్లి కోసం చనిపోవడం మాత్రం సరికాదని కామెంట్లు చేస్తున్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *