ఫోన్‌పేలో లంచం.. ఏసీబీ తనిఖీల్లో అడ్డంగా బుక్కైన ఉద్యోగి అరెస్ట్

 ఫోన్‌పేలో లంచం.. ఏసీబీ తనిఖీల్లో అడ్డంగా బుక్కైన ఉద్యోగి అరెస్ట్

ఫోన్‌పేలో లంచం.. ఏసీబీ తనిఖీల్లో అడ్డంగా బుక్కైన ఉద్యోగి అరెస్ట్

ఫోన్‌పేలో లంచం తీసుకుంటూ.. ఓ ప్రభుత్వ ఉద్యోగి రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ ఉద్యోగికి రావాల్సిన పెండింగ్ బకాయిలు చెల్లించడం కోసం లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలోనే ఒకసారి ఫోన్‌పేలో డబ్బులు చెల్లించగా.. మరోసారి డబ్బులు ఇవ్వాలని పేర్కొన్నాడు. దీంతో విసుగు చెందిన ఆ వ్యక్తి.. ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగి ఆ ఉద్యోగిని పట్టుకున్నారు. ఆ ఉద్యోగిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.

ACB Raids

ఫోన్‌పేలో లంచం తీసుకుంటూ ఉద్యోగి అరెస్ట్

తెలంగాణలో అవినీతి అధికారుల భరతం పట్టేందుకు అవినీతి నిరోధక శాఖ.. రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక దాడులు చేస్తోంది. మరోవైపు.. బాధితుల ఫిర్యాదులతో రంగంలోకి దిగి లంచం తీసుకునే అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఏసీబీ అధికారులు చేస్తున్న దాడులతో లంచం తీసుకునే ప్రభుత్వ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏసీబీ అధికారులు చేసిన దాడుల్లో ఓ సీనియర్ అకౌంటెంట్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.

మోత్కూర్ ఎస్‌టీఓ ఆఫీస్‌లో పనిచేస్తున్న సీనియర్ అకౌంటెంట్ ఎండీ ఖాదిర్‌.. ఒక ఉద్యోగికి జీతం ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేశాడు. మొదట కొన్ని డబ్బులు తీసుకున్న తర్వాత మరోసారి డబ్బులు డిమాండ్ చేయడంతో.. రెండోసారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. మోత్కూర్ ఎస్‌టీఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి 38 రోజుల జీతం ఇవ్వడం కోసం ఖాదిర్ రూ.10 వేల లంచం డిమాండ్ చేశాడు. 38 రోజులకు గానూ రూ.1,09,384 వేతనం చెల్లించేందుకు లంచం డిమాండ్ చేయగా.. బాధితుడు ఒప్పుకున్నాడు.

దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. భువనగిరిలోని ఖాదిర్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు.. తీగ లాగితే డొంకంతా కదిలింది. మొదట రూ.5 వేలను తన తోటి ఉద్యోగి సీనియర్‌ అసిస్టెంట్‌ నిరంజన్‌ ఫోన్ నంబర్‌కు ఫోన్ పే చేయించుకున్నాడు. ఆ తర్వాత మరో రెండో విడత రూ.5 వేలు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలోనే ఏసీబీని ఆశ్రయించగా.. ఖాదిరా డబ్బులు తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు. ఎండీ ఖాదీర్‌ ఫోన్‌ను సీజ్ చేసుకుని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు.. హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.

ఇటీవలె సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కమటం శ్రావణ్ కుమార్ ఏసీబీ అధికారుల తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయారు. ఆయన ఏకంగా రూ.40 కోట్ల అక్రమ ఆస్తులు సంపాదించినట్లు గుర్తించారు. భారీగా ఆస్తులు, బంగారం, డబ్బు, లగ్జరీ కార్లను కూడబెట్టినట్లు ఏసీబీ అధికారుల సోదాల్లో వెల్లడైంది. ఆ తర్వాత

కమటం శ్రావణ్ కుమార్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు కోర్టులో హాజరు పరిచారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *