దయచేసి పుకార్లను నమ్మవద్దు.. ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యర్థన

 దయచేసి పుకార్లను నమ్మవద్దు.. ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యర్థన

దయచేసి పుకార్లను నమ్మవద్దు.. ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యర్థన

ఏపీలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మరోసారి స్పష్టం చేశారు. గృహ అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని.. ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. పుకార్లు నమ్మి పానిక్ బుకింగ్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అక్రమంగా నిల్వ చేసేవారిపై 6ఏ కేసులు నమోదుచేస్తామన్న మంత్రి నాదెండ్ల మనోహర్.. ఇప్పటి వరకూ 616 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. 2500 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసినట్లు తెలిపారు.

Nadendla manohar

ఎల్పీజీ గ్యాస్ కొరతపై నాదెండ్ల మనోహర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోరారు. అనవసర భయాలకు పోయి.. పుకార్లు నమ్మి, పానిక్ బుకింగ్ చేయవద్దని కోరారు. దీంతో సప్లై చైన్ మీద అనవసర ఒత్తిడి పడుతుందని కోరారు. సోమవారం రోజున విలేకర్ల సమావేశం నిర్వహించిన నాదెండ్ల మనోహర్ .. ఏపీలో ఎల్పీజీ గ్యాస్ అంశం గురించి కీలక వివరాలు వెల్లడించారు.

” కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనల ప్రకారం.. గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్యాస్ రీఫిల్ బుకింగ్ కోసం 45 రోజుల సమయం ఇవ్వాలి. పట్టణ ప్రాంతాలలో అయితే 25 రోజుల సమయం ఇవ్వాలి. ఎవరైనా గడువులోపు గ్యాస్ సిలిండర్ బుకింగ్ కోసం ప్రయత్నిస్తే సిస్టమ్ మీద భారం పడుతుంది తప్ప.. మీకు సిలిండర్ వెంటనే వచ్చే అవకాశం ఉండదు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో సరఫరా సరిగా లేక కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇది. ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలి. మాకున్న సమాచారం ప్రకారం ఒక కుటుంబం ఏడాదికి 6 సిలిండర్ల కంటే ఎక్కువ వినియోగించకపోవచ్చు. దయచేసి మీరు తొందరపడి పానిక్ బుకింగ్ చేసుకోవద్దు. దీంతో సిస్టమ్‌పై ఒత్తిడి పడుతుంది.”

“బ్లాక్ మార్కెట్ మీద ఉక్కుపాదం మోపుతున్నాం. ఎక్కడైనా గ్యాస్ ఏజెన్సీలు గృహ అవసరాలకు ఉపయోగించే సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లిస్తుంటే అలాంటి వారిపై 6ఏ కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించాం. ఇప్పటి వరకూ 616 వరకూ 6ఏ కేసులు నమోదు చేశాం. 2500 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేశాం. క్షేత్రస్థాయిలో విజిలెన్స్ శాఖ, సివిల్ సప్లై శాఖ, రెవెన్యూ శాఖను అప్రమత్తం చేసి.. జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలో ప్రతి జిల్లాలో కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. వీటి ద్వారా ప్రజలకు సమాచారం అందిస్తాం. వినియోగదారులు ఆందోళన చెందవద్దు.” అని మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు.

” ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు, సమాచారం ఇవ్వటం లేదని ఆందోళన చెందొద్దు. మొబైల్ యాప్ ద్వారా, ఐవీఆర్ఎస్, వాట్సాప్, మిస్డ్ కాల్ ద్వారా గ్యాస్ సిలిండర్లు బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ సమాచారం అంతా ప్రజలకు అందుబాటులో ఉంది. సమాచారంలో ఎలాంటి లోపం లేకుండా, వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. దయచేసి పుకార్లను నమ్మవద్దు” అని నాదెండ్ల మనోహర్ కోరారు.

ఎల్పీజీ గ్యాస్.. చంద్రబాబు ఆదేశాలు

మరోవైపు రాష్ట్రంలో గృహ అవసరాలకు కావాల్సిన వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆస్పత్రులు, పాఠశాలలు, దేవాలయాలకు నిరంతర సరఫరా ఉండాలని స్పష్టం చేశారు. ఏపీలో ఎల్పీజీ నిల్వలు, బుకింగ్, సరఫరా అంశాలపై చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌, గ్యాస్ సంస్థల ప్రతినిధులు, గ్యాస్ సరఫరా కంపెనీల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం ఏపీలో 17,209 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ నిల్వలు అందుబాటులో ఉన్నాయని.. 1154 ఏజెన్సీల నుంచి గ్యాస్ సరఫరా జరుగుతోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలోఎల్పీజీ సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *