ఏపీలో పేదలకు తీపికబురు.. ఇకపై ఇంటికి రూ.2.39 లక్షలు ఇస్తారు
ఏపీలో పేదలకు తీపికబురు.. ఇకపై ఇంటికి రూ.2.39 లక్షలు ఇస్తారు
Pmay Gramin Scheme Rs 2.39 Lakhs In Andhra Pradesh: ఏపీలో ఐదేళ్లలో అర్హులందరికి ఇళ్లు కట్టిస్తామని హామీ దిశగా మరో ముందడుగు పడింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ (పీఎంఏవై-రూరల్) పథకం కింద పేదలకు మంజూరు చేసే ఇళ్ల యూనిట్ ధరను రూ.2.39 లక్షలకు ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. ఇందులో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
హైలైట్:
ఏపీలో పేదలకు తీపికబురు
పీఎంఏవై-రూరల్ పథకం అమలు
యూనిట్ విలువ రూ.2.39 లక్షలు
AP Govt Rs 2.39 For Pmay Gramin Scheme
పీఎంఏవై గ్రామీణ్ పథకం రూ.2.39 లక్షలు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రం తీపికబురు చెప్పింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద అందించే పేదల ఇళ్ల ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.39 లక్షలు ఇస్తారు. వీటిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.1.20 లక్షలు ఇస్తాయి. కేంద్ర వాటా రాయితీ కింద రూ.72 వేలు, 60 శాతం.. రాష్ట్ర ప్రభుత్వ వాటా రాయితీ రూ.48 వేలు 40 శాతం చొప్పున ఇస్తారు. రూ.27 వేలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇస్తారు. మరో రూ.12 వేలు మరుగుదొడ్డి నిర్మాణానికి ఇవ్వనున్నారు. డ్వాక్రా రుణం కింద మరో రూ.80 వేలు పావలా వడ్డీతో బ్యాంకుల ద్వారా మంజూరు చేస్తారు. అయితే ప్రభుత్వమే ఈ వడ్డీని భరించనుంది.
ఇకపై పేదల ఇళ్లకు మొత్తం రూ.2.39 లక్షలు ఇవ్వనున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ విషయంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పక్కా ఇళ్లు లేని పేద కుటుంబాలకు గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించనున్నారు. దీంతో అర్హులైన లబ్ధిదారులు తమ సొంత పక్కా ఇల్లు నిర్మించుకునే అవకాశం పొందనున్నారు.
ఏపీ ప్రభుత్వం మరికొన్ని అప్డేట్స్
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా గ్రామీణ మండలాల్లో 12 కొత్త ప్రైవేటు కళాశాలల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసేందుకు అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి కళాశాలల ఏర్పాటుకు ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా ప్రకటన విడుదల చేయనున్నారు. అంతేకాదు రాష్ట్ర ఈఎస్ఐ ఇన్ఛార్జి డైరెక్టర్గా కార్మిక శాఖ కమిషనర్ గంధం చంద్రుడిని నియమించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం గంధం చంద్రుడు నియామకానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.