అమరావతికి 20 ఎకరాలిచ్చిన హైదరాబాద్‌ వాసి.. భూముల పత్రాలు తీసుకొచ్చి ఇచ్చేశారు

 అమరావతికి 20 ఎకరాలిచ్చిన హైదరాబాద్‌ వాసి.. భూముల పత్రాలు తీసుకొచ్చి ఇచ్చేశారు

Hyderabad Man Donated 20 Acres For Ap Capital Amaravati:

నవ్యాంధ్ర రాజధాని అమరావతి రెండో విడత భూ

సేకరణ కొనసాగుతోంది. రైతులు ఈ మేరకు భూముల్ని అందజేస్తున్నారు. హైదరాబాద్‌‌లో నివాసం ఉంటున్న ఒకరు ఏకంగా 20 ఎకరాల భూమిని రాజధానికి ఇచ్చేశారు. ఈ మేరకు పత్రాలు అధికారులకు అందజేశారు.. ఎంతో ఆనందంతోనే భూముల్ని అమరావతికి ఇస్తున్నామని హైదరాబాద్‌కు చెందని ఉమామహేశ్వరరావు అంటున్నారు. అమరావతి కచ్చితంగా విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు.

హైలైట్:

అమరావతికి రెండో విడత భూసేకరణ

20 ఎకరాలు ఇచ్చేసిన హైదరాబాద్‌వాసి

ఒకే రోజు 31 ఎకరాలు ఇచ్చిన రైతులు

Amaravati Hyderabad Man Donated 20 Acers

అమరావతికి హైదరాబాద్‌వాసి 20 ఎకరాలు విరాళం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి భారీగా భూమిని అందజేశారు. ఆయన రాజధాని రెండోవిడత భూ సమీకరణలో భాగంగా ఈ భూముల్ని ఇచ్చేశారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న వెలినేని ఉమామహేశ్వరరావుకు ఎండ్రాయిలో 20.60 ఎకరాల భూమి ఉంది. ఈ మేరకు ఆ భూముమల పత్రాలను సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ లలితను కలిసి అందజేశారు. తాను అమరావతి భూసేకరణకు ఆనందంగా భూములు ఇస్తున్నానని వెలినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు దేద, విదేశాల్లో గుర్తింపు ఉందని.. కచ్చితంగా అమరావతి విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం ఒక్కరోజు అమరావతి భూసేకరణలో భాగంగా.. మొత్తంగా రైతులు 31.26 ఎకరాలను ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఒకే వ్యక్తి ఏకంగా 20 ఎకరాల భూమిని ఆసక్తికరంగా మారింది.

మరోవైపు అమరావతిలో అభివృద్ధి పనులు శరవేగంగా సగుతున్నాయి. హైకోర్టుకు సంబంధించి నిర్మాణ పనులు వేగవంతం చేశారు. శుక్రవారం మంత్రి నారాయణ ఏకధాటిగా 15వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఫౌండేషన్ (రాఫ్ట్) పనుల్ని ప్రారంభించారు. హైకోర్టు భవనాల నిర్మాణం కోసం ఏకంగా 65వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ను వినియోగిస్తున్నారు. హైకోర్టు భవనాన్ని బేస్‌మెంట్‌+గ్రౌండ్‌+8 అంతస్తులుగా 50.4 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నారు. 2027 నాటికి హైకోర్టు పనులు పూర్తి చేస్తామంటున్నారు మంత్రి నారాయణ. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. అమరావతిలో అధికారులు, ఉద్యోగుల కోసం 4వేలకు పైగా ఇళ్లు నిర్మిస్తున్నామని.. ఈ ఏడాది మార్చి నెలాఖరుకు 3,500 నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు మంత్రి.

మరోవైపు అమరావతిలోని సచివాలయం ఐకానిక్ భవనాలు నిర్మాణం చేయనున్నారు. ఈ క్రమంలో ఏపీ నుంచి అధికారుల బృందం.. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల రాజధానులు నయా రాయ్‌పూర్, హైదరాబాద్‌లు వెళ్లనుంది. అక్కడ రాష్ట్ర సచివాలయాల పరిశీలించనున్నారు. ఈ మేరకు అమరావతికి సంబంధించి ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ అమరావతిలో సమావైశమై కీలక నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో కట్టబోయే సచివాలయానికి సంబంధించి ప్రస్తుత అవసరాలపై అధ్యయనం చేయనున్నారు. ఈ కేబినెట్ సబ్‌కమిటీ కమిటీ సోమవారం కూడా మరోసారి సమావేశంకానుంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *