ఎన్నికాల ఏడాదిలో తెలంగాణ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. చేరికలు, ప్రచారాలపై ప్రధాన పార్టీలన్నీ దృష్టి సారించాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ కూడా ముచ్చటగా మూడో సారి ఎన్నికల్లో గెలిచేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చేరికలను ప్రోత్సహిస్తోంది. మరోవైపు బీజీపీ బలహీనపడడంతో పుంజుకున్న కాంగ్రెస్ పరిస్థితి మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లాలో అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. తాజాగా కాంగ్రెస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు అనిల్కుమార్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో హస్టం పార్టీకి షాక్ తగిలింది. […]Read More
రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచితీరాలని పట్టుదలగా ఉన్న బీజేపీ మైనారిటీలపై ఓట్లపై గురిపెట్టినట్లు సమాచారం. తెలంగాణాలో ముస్లింల ఓట్లు గణనీయంగా ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. ముస్లిం ఓట్లతో పాటు క్రిస్తియన్ ఓట్లు కూడా ఉన్నాయి. అయితే రెండింటిలో ముస్లిం ఓట్లు చాలా ఎక్కువ. అందుకనే ఈ వర్గం ఓట్లను పార్టీ వైపుకు మళ్ళించేందుకు అవసరమైన ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముందుగా ఓల్డ్ సిటిపై టార్గెట్ ఫిక్స్ చేసినట్లు పార్టీవర్గాలు చెప్పాయి. ముస్లింఓట్లను ఎందుకు టార్గెట్ చేసిందంటే ఎంఐఎంను […]Read More
తెలంగాణ ఎన్నికల్లో హ్యాట్రిక్ విషయంపై కన్నేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అందుకు తగ్గ కసరత్తులు చేస్తున్నారు. ముందుగా సర్వేలు, ఇతర నివేదికల ఆధారంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు జాబితాపై ఓ అంచనాకు రానున్నారు. ఇప్పటికే మెజారిటీ నియోజకవర్గాల్లో పోటీలో నిలబెట్టే అభ్యర్థులపై కేసీఆర్ ఓ స్పష్టతకు వచ్చారు. దీంతో ఆగస్టు మూడో వారంలో అభ్యర్థులు తొలి జాబితాను వెల్లడించేందుకు ఆయన సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. ఎలాంటి సమస్యలు లేని నియోజకవర్గాల్లో అభ్యర్థులు జాబితాను ప్రకటించే అవకాశముంది. ఇక […]Read More
అసలే వ్యక్తిగతంగా ఇబ్బందుల్లో ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. 78 ఏళ్ల వనమా ఎన్నికను చెల్లదని ప్రకటించింది. 2018 ఎన్నికల్లో ఆయన తప్పుడు సమాచారం ఇచ్చారని అందుకనే ఎన్నికను కొట్టివేస్తున్నట్లు సంచలన తీర్పు ఇచ్చింది. వనమా ఎన్నికను రద్దు చేయడమే కాక.. ఆయన తర్వాత రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగానూ ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి గెలిచి.. బీఆర్ఎస్ లోకి వనమా వెంకటేశ్వరరావు […]Read More
ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోను రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను బీసీలకు కేటాయించేందుకు తెలంగాణా పీసీసీ తీర్మానించింది. బీసీల జనాభా రీత్యా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోను మూడు సీట్లను బీసీలకు కేటాయించాలని బీసీ నేతలు డిమాండ్ చేసినట్లు పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి తెలిపారు. బీసీలకు వీలైనన్ని సీట్లు కేటాయించటంలో పార్టీకి మేలు జరుగుతుందని పార్టీ నాయకత్వం నమ్ముతున్నట్లు మల్లు చెప్పారు. అయితే బీసీ నేతలు డిమాండ్ చేసినట్లుగా మూడు సీట్లు కాకుండా రెండింటికి పరిమితం చేయాలని పార్టీ తీర్మానంచేసిందన్నారు. బీసీ […]Read More
ఈ ఏడాది ఎన్నికల నేపథ్యంలో తెలంగాణపై బీజేపీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించింది. అందుకే ఇటీవల హడావుడిగా అధ్యక్షుణ్ని మార్చేసింది. బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఆయన సారథ్యంలోనే పార్టీ తెలంగాణలో ఎన్నికలను ఎదుర్కోబోతుందని స్పష్టం చేసింది. అంతా బాగానే ఉంది.. కానీ ఈ ఎన్నికలకు బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరూ అంటే ఠక్కున సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. సొంత పార్టీలో సీనియర్ నేతలతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన […]Read More