వైసీపీలో ఫస్ట్ లిస్ట్ రెడీ 75 మంది కే టికెట్స్ ap assembly elections ||reddystalk||

ఏపీలో రాజకీయ సందడి బాగానే సాగుతోంది. ఈ ఏడాది డిసెంబర్ లో ఎన్నికలు ఉన్న తెలంగాణా కంటే కూడా
ఏపీ రాజకీయ నేతలే తొందర పడిపోతున్నారు. చంద్రబాబు అయితే గత ఏడాది నుంచి జనంలోనే ఉంటూ
వస్తున్నారు. ఇపుడు తండ్రీ కొడుకులు ఇద్దరూ టీడీపీని పైకి లేపాలని చేస్తున్న ప్రయత్నాలతో ఏపీలో అటూ ఇటూ కలియతిరుగుతున్నారు.

జగన్ అయితే పర్యటనలు పెద్దగా పెట్టుకోవడంలేదు. అధికార పార్టీకి ప్రస్తుతానికి ఆ అవసరం లేదని అంటున్నారు.
ఆయన జిల్లాలలో జరిగే ప్రారంభోత్సవాలు ఇతర కార్యక్రమాలలోనే మాట్లాడుతున్నారు. మరో వైపు జగన్
పార్టీని సార్వత్రిక ఎన్నికల కోసం సమాయత్తం చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఈ దసరాకు ఫస్ట్ లిస్ట్ ను
వైసీపీ జగన్ ప్రకటిస్తున్నారు.

మొత్తం 175 సీట్లలో వివాదం లేనివి, కచ్చితంగా వారికే టికెట్లు దక్కేవి. పోటీ మరొకరు రానివి చూసి మరీ ఒక
జాబితాను తయారు చేస్తున్నారు అని అంటున్నారు. ఈ జాబితాలో 75 పేర్లు ఉంటాయని అంటున్నారు.
వీరికి టికెట్లు ఖాయమని చెప్పేయబోతున్నారా లేక అఫీషియల్ గానే రిలీజ్ చేస్తారా అన్నది తెలియడంలేదు.

ఇదిలా ఉంటే తొలి జాబితాలో 75 మంది సిట్టింగులు ఉన్నారు. వారంతా బలమైన నేతలు, మళ్ళీ గెలిచి పార్టీని
అధికారంలోకి తెచ్చే దిట్టలుగా భావించే లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు అని సమాచారం. ఇక రాయలసీమ
నాలుగు జిల్లాలలో చూసుకుంటే సిట్టింగులకు దాదాపుగా అందరికీ టికెట్లు మళ్లీ ఖాయమని సమాచారం.

కొంతమంది మీద వేటు పడుతుందని అంతా అనుకుంటున్నా అలాంటిదేమీ ఉండబోదని అంటున్నారు.
మరో వైపు చూస్తే సిట్టింగులకు సీట్ల గల్లంతు అన్నది ఎక్కువగా ప్రకాశం …నెల్లూరు.. గుంటూరు… క్రిష్ణా..
ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రా వరకు అని సమాచారం.

ఒక పాతిక మంది దాకా సిట్టింగులకు ఈ ప్రాంతంలోనే టికెట్లు రాకుండా పోతాయని అంటున్నారు.
వారి స్థానంలో కొత్త ముఖాలను తెచ్చి నిలబెట్టాడం ద్వారా గెలుపు పిలుపు అందుకోవాలని చూస్తున్నారు.

ఇక సీమలో పోటీ ఎపుడూ పార్టీల కంటే వర్గాల మీదనే ఆధారపడి ఉంటుందని అంటున్నారు. అందువల్ల
అక్కడ టికెట్లు తమ వైపు ఉండే వారికి ఇచ్చుకోవడం ఏ రాజకీయ పార్టీ అయినా చేసేదే. కోస్తా జిల్లాలలో మాత్రం
సీన్ మారుతుంది. రాజకీయాన్నే చూస్తారు. అలాగే అభ్యర్ధుల పనితీరు కొలమానంగా ఉంటుందని అంటున్నారు.
దాంతో రిపేర్లు అన్నీ ఇక్కడే అని చెబుతున్నారు.

మొత్తానికి దసరాకు వైసీపీ రిలీజ్ చేయబోయే ఫస్ట్ లిస్ట్ లో ఎక్కువగా రాయలసీమకు చెందిన సిట్టింగులే
ఉంటారని మిగిలిన వాటిలో పక్కాగా గెలిచే కోస్తా జిల్లాల వారు ఉంటారని సమాచారం. దసరాకే తొలి జాబితా
రిలీజ్ చేయడం అనేది పక్క ప్రణాళిక ప్రకారమే అంటున్నారు . చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *