ఏపీ ఇంటర్ విద్యార్థులకు ఈ కొత్త రూల్ గురించి తెలుసా.. ఆ తప్పు చేశారో దొరికిపోతారు జాగ్రత్త

 ఏపీ ఇంటర్ విద్యార్థులకు ఈ కొత్త రూల్ గురించి తెలుసా.. ఆ తప్పు చేశారో దొరికిపోతారు జాగ్రత్త

AP Inter Practicals 2026

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ప్రాక్టికల్స్, పబ్లిక్ పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రాక్టికల్స్ జరిగే సెంటర్లలో సీసీ కెమెరాలు తప్పనిసరి చేస్తూ, వాటిని బోర్డు కార్యాలయానికి అనుసంధానం చేయాలని ఆదేశించారు. 45 సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక నిఘా, సిట్టింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. మొదటి ఏడాది పరీక్షల్లో కొత్త మార్పులు ప్రవేశపెట్టారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

హైలైట్:

ఏపీ ఇంటర్ పరీక్షలపై కీలకమైన సమీక్ష చేశారు

ప్రాక్టికల్స్ నిర్వహించే సెంటర్లలో సీసీ కెమెరాలు

ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు రెండు విడతలుగా

AP Inter Practicals

ఏపీ ఇంటర్ ప్రాక్టికల్‌ పరీక్షలకు సీసీ కెమెరాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రాక్టికల్స్ నిర్వహించే సెంటర్లలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా ఆదేశించారు.
త్వరలో జరగనున్న పబ్లిక్‌ పరీక్షలు, ఇంటర్మీడియట్‌ విద్యలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై రంజిత్ బాషా కీలకమైన సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు రెండు విడతలుగా జరిగే ఈ పరీక్షలను.. అలాగే ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు జరగనున్న పబ్లిక్ పరీక్షలను పర్యవేక్షించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నారు. ప్రాక్టికల్ పరీక్షల కేంద్రాల్లో ఏర్పాటు చేసే సీసీ కెమెరాలను బోర్డులోని కార్యాలయానికి అనుసంధానం చేయాలని ఆదేశించారు. దీనివల్ల పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెరుగుతుందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పబ్లిక్ పరీక్షల సమయంలో గుర్తించిన 45 సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేకంగా సిట్టింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేస్తారు. ఈ కేంద్రాలను రాష్ట్ర కార్యాలయం నుంచే సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తారు. ఈసారి ఇంటర్మీడియట్ మొదటి ఏడాది పరీక్షల్లో కొన్ని కొత్త మార్పులు ప్రవేశపెట్టారు. ఈ మార్పులను పరీక్షా కేంద్రాల సిబ్బంది, అధికారులు అందరూ క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలి. ఈ మార్పుల వల్ల పరీక్షల నిర్వహణ మరింత మెరుగుపడుతుందని అధికారులు ఆశిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 45 సమస్యాత్మక కేంద్రాల్లో అదనపు నిఘా ఉంటుందని, రాష్ట్ర కార్యాలయం నుంచి సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామని ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు. ఈసారి మొదటి ఏడాది పరీక్షల్లో అనేక మార్పులు ఉన్నాయని, వాటిని అందరూ జాగ్రత్తగా అర్థం చేసుకొని విధులు నిర్వర్తించాలని సూచించారు. ఇంటర్ ప్రాక్టికల్స్, పరీక్షల సమయంలో విద్యార్థులు కూడా అలర్ట్‌గా ఉండాలి.. ఏదైనా తేడా వస్తే అడ్డంగా దొరికిపోతారు జాగ్రత్త. సీసీ కెమెరాల నిఘాలో సెంటర్లు ఉంటాయని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షల్ని, ప్రాక్టికల్స్‌ను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *