ఏపీలో దారుణంగా పడిపోయిన కోడిగుడ్డు ధరలు.. మరీ అంత తక్కువ రేటా!

 ఏపీలో దారుణంగా పడిపోయిన కోడిగుడ్డు ధరలు.. మరీ అంత తక్కువ రేటా!

Andhra Pradesh Eggs Price Drop: కోడిగుడ్ల ధరలు దారుణంగా పడిపోతున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం దెబ్బకు భారత్ నుంచి కోడి గుడ్ల ఎగుమతికి బ్రేక పడింది. ఈ క్రమంలో గుడ్ల నిల్వ పెరిగిపోతోంది.. దీంతో రేటు సగానికి పైగా తగ్గింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా గగనతల, సముద్ర మార్గాలపై ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో ఏపీలో కూడా గుడ్ల ధరలు పడిపోయాయి.. దీంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.

హైలైట్:

ఏపీలో పడిపోయిన గుడ్ల ధరలు

సగానికి సగం తగ్గిన ఎగ్స్ రేట్లు

యుద్ధం ప్రభామే కారణమట

Eggs Price Drop

ఏపీలో కోడిగుడ్ల ధరలు పడిపోయాయి

ఆంధ్రప్రదేశ్‌లో కోడిగుడ్ల ధరల దారుణంగా పడిపోయాయి.. గత రెండు మూడు రోజులుగా ధరలు పడిపోతూ వస్తున్నాయి. 100 గుడ్ల హోల్‌సేల్‌ ధర రూ.420గా నిర్ణయించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఫౌల్ట్రీలలో రోజుకు దాదాపు 5 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే ఈ మొత్తం ఉత్పత్తిలో రాష్ట్రంలో సగం మాత్రమే వినియోగిస్తున్నారు. మిగిలిన కోడిగుడ్లను దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే ఉత్పత్తికి తగిన విధంగా వినియోగం తగ్గడంతో ఇప్పుడు ఎగమతి తగ్గింది, ధరలు తగ్గిపోయాయి. అందుకే కోడిగుడ్ల ధరలు పడిపోయాయి.

వీటికి తోడు ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధం కూడా ఒక కారణం అంటున్నారు. ఎందుకంటే చెన్నై పోర్టు నుంచి గల్ఫ్‌ దేశాలకు కోడిగుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయని చెబుతున్నారు. ఈ ప్రభావం కూడా కోడిగుడ్ల ధరలపై ఉందంటున్నారు. ప్రస్తుతం ఒక్కో గుడ్డును రూ.4.45కు విక్రయిస్తున్నారు. అయితే బయట చికెన్‌ షాపుల్లో రూ.5 నుంచి రూ.5.50కు, కిరాణా షాపుల్లో రూ.6కు అమ్ముతున్నారట. వాస్తవానికి గతేడాది డిసెంబరు 20న గుడ్ల ధరలు దారుణంగా పెరిగాయి. 100 కోడిగుడ్ల ధర రికార్డు స్థాయిలో రూ.678కు చేరిన సంగతి తెలిసిందే. అయితే రిటైల్‌లో గుడ్డు రూ.8కు విక్రయించారు. అయితే ధర నెమ్మదిగా తగ్గినా.. కొన్ని రోజులుగా మాత్రం దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ(ఎన్ఈసీసీ) ధర రూ.4.20కి పడిపోయింది అంటున్నారు. దేశంలో పలు చోట్ల గుడ్డు ధర రూ.3.30కి కూడా పడిపోయిందనే టాక్ వినిపిస్తోంది. కోడిగుడ్ల ధరలు పడిపోవడంతో పౌల్ట్రీల రైతులు ఆందోళనలో ఉన్నారు.

అక్కడెక్కడో యుద్ధం ఏమో కానీ.. ఈ ప్రభావం మన దేశంలో ఎన్నో రంగాలపై కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ విషయంలో ఇబ్బందులు వస్తాయంటున్నారు. అలాగే కోడి గుడ్ల ధరలు, అలాగే రైతుల పంటలు సహా ఎన్నో రంగాలకు సంబంధించిన ఎగుమతి ఆగిపోయింది. యుద్ధం ఇలాగే కొనసాగితే ఇబ్బందులు తప్పవని జనాలు కూడా భయపడుతున్నారు. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతల కారణంగా పోర్టులు, ఎయిర్ పోర్టులు మూసివేయడంతో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *