TSRTC Income : ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం.… ఒక్క రోజే 51.74 లక్షల మంది ప్రయాణం

 TSRTC Income : ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం.… ఒక్క రోజే 51.74 లక్షల మంది ప్రయాణం

TSRTC New Record:రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 19న రికార్డు స్థాయిలో 51.74 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించారు. పాస్ హోల్డర్లు మినహా 48.5 లక్షల మందికి ఆర్టీసీ టిక్కెట్లు జారీ చేసింది.వీరిలో 30.16 లక్షల మంది మహిళలు ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

TSRTC New Record: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి రావడంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టిఎస్అర్టిసి ) ఆదాయం భారీగా పెరిగింది.ఆర్టీసీ బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతిన్నాయి. డిసెంబర్ 9 నుంచి తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్,సిటీ ఆర్డినరీ,మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించడంతో……నిలబడటానికి కూడా చోటు లేనంతగా బస్సులన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుున్నాయి.

ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 51.74 లక్షల మంది

ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినట్లుగా తెలంగాణ ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి.బస్ పాసులను మినహాయిస్తే….దాదాపు 48.5 లక్షల మంది ప్రయాణం చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే మొత్తం ప్రయాణికుల్లో 30.16 లక్షల మంది మహిళలే ఉండడం గమనార్హం. మహాలక్ష్మి పథకం ప్రారంభానికి ముందు మొత్తం ప్రయాణికుల్లో మహిళలు కేవలం 40 శాతం మాత్రమే ఉండగా…..ఇప్పుడు ఆ సంఖ్య 60 శాతానికి పెరిగినట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి.ఇక సోమవారం ఒక్క రోజే ఆర్టీసీకి రూ.21.10 కోట్ల ఆదాయం వచ్చింది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు ఆర్టీసీ జొన్లలో సోమవారం బస్సులు 33.6 లక్షల కిలోమీటర్లు తిరిగాయి. అత్యధికంగా కరీంనగర్ జోన్ లో ఆర్టీసీ బస్సులు 14.49 లక్షల కిలోమీటర్లు తిరిగాయి.ఇక గ్రేటర్ హైదరాబాద్ జోన్ లో 10.93 లక్షల కిలోమీటర్లు తిరిగాయి. డిసెంబర్ 4న అత్యధికంగా 34.16 లక్షల కిలోమీటర్లు తిరుగగా ఆ రోజు రూ.21.04 కోట్లు ఆదాయం వచ్చింది.అయితే డిసెంబర్ 18న ( సోమవారం ) మొత్తం 33.36 లక్షల కిలోమీటర్లు మాత్రమే తిరిగినా ఆదాయం మాత్రం రూ.21.10 కోట్లు వచ్చింది.ఇక బస్సులో అకుపెన్సీ రేషియో 97.31 శాతానికి పెరిగినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *