Tenth Class: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల్లో మార్పులు

 Tenth Class: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల్లో మార్పులు

తెలంగాణలో వచ్చే ఏడాది నుంచి పదో తరగతి పరీక్షలను 100 మార్కులకే నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. వచ్చే ఏడాది 2024-2025 నుంచి ఈ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నట్లు విద్యాశాఖ అధికారి తెలిపారు.

తెలంగాణలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షల్లో మార్పులు చేస్తున్నట్లు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 80 మార్కులకు ఉన్న పరీక్ష పేపర్‌ను ఇకపై 100 మార్కులకే ఉండనుందని తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం 2024-2025 నుంచి 100 మార్కులకే పరీక్ష పేపర్ ఉంటుందని విద్యాశాఖ తెలిపింది.

ఇప్పటి వరకు 80 మార్కులకు పేపర్ ఉండగా.. 20 మార్కులు ఇంటర్నల్ ఉండేది. ఈ పద్ధతిని ఇకపై ఆపేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. పదో తరగతి విద్యార్థులకు గత కొన్నేళ్ల నుంచి గ్రేడింగ్ పద్ధతిలో రిజల్ట్స్ వస్తున్నాయి. కానీ ఇకపై ఈ గ్రేడింగ్ సిస్టమ్‌ను కూడా తీసేస్తున్నట్లు వెల్లడించింది.

ఇంటర్నల్ పరీక్షల్లో అక్రమాలు జరుగుతున్నాయని విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఇకపై ఫైనల్ పరీక్షల్లో కూడా విద్యార్థులకు 24 పేజీల ఆన్సర్‌ బుక్‌లెట్స్‌ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *