TDP MLA: చేతికి సెలైన్ తోనే ప్రజాదర్బార్.. టీడీపీ ఎమ్మెల్యే వీడియో వైరల్!

 TDP MLA: చేతికి సెలైన్ తోనే ప్రజాదర్బార్.. టీడీపీ ఎమ్మెల్యే వీడియో వైరల్!

మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి చేతికి సైలైన్ తోనే ప్రజాదర్బార్ నిర్వహించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆఖరి నిమిషంలో కార్యక్రమాన్ని వాయిదా వేస్తే ప్రజలు ఇబ్బంది పడుతారని అనారోగ్యంతోనే ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.

ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఈ రోజు తన కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆయన ఓ చేతికి సైలైన్ పెట్టుకుని.. మరో చేస్తో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అక్కడి నుంచే అధికారులకు వినతుల్లో పేర్కొన్న సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.

 

ఎమ్మెల్యేపై ప్రశంసలు..

శనివారం రోజు ప్రజాదర్బార్ ఉంటుందని మూడు రోజుల క్రితమే ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. అనారోగ్యం కారణంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తే ప్రజలు ఇబ్బంది పడుతారని భావించిన ఎమ్మెల్యే అలానే కొనసాగించాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. దీంతో ఆ కార్యక్రమం కొనసాగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యేపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *