RTC Bus Ticket Hiked: ఇవాళ్టి నుంచి భారీగా పెరగనున్న ఆర్టీసీ బస్సు ఛార్జీలు.. ఏ బస్సుకు ఎంతంటే?

 RTC Bus Ticket Hiked: ఇవాళ్టి నుంచి భారీగా పెరగనున్న ఆర్టీసీ బస్సు ఛార్జీలు.. ఏ బస్సుకు ఎంతంటే?

నగరవాసులపై మరో పిడుగు పడనుంది. హైదరాబాద్‌ పరిధిలో నడిచే అన్ని రకాల సిటీ బస్సుల్లో అదనపు ఛార్జీలు నేటి (అక్టోబర్‌ 6) నుంచి పెరగనున్నాయి. కనీస చార్జీపై 50 శాతం టికెట్‌ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎలక్ట్రిక్‌ బస్సులు ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ అన్ని .

హైదరాబాద్‌, అక్టోబర్ 5: నగరవాసులపై మరో పిడుగు పడనుంది. హైదరాబాద్‌ పరిధిలో నడిచే అన్ని రకాల సిటీ బస్సుల్లో అదనపు ఛార్జీలు నేటి (అక్టోబర్‌ 6) నుంచి పెరగనున్నాయి. కనీస చార్జీపై 50 శాతం టికెట్‌ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎలక్ట్రిక్‌ బస్సులు ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ అన్ని బస్సుల్లో మొదటి మూడు స్టేజీలకు రూ.5, నాలుగో స్టేజీ నుంచి చివరి దాకా రూ.10 అదనంగా ఛార్జీలు పెరగనున్నాయి.

మెట్రో డీలక్స్, ఎలక్ట్రిక్‌-మెట్రో ఏసీ సర్వీసుల్లో అయితే మొదటి స్టేజీకి రూ.5, రెండో స్టేజీ నుంచి చివరిదాకా రూ.10 అదనంగా ఛార్జీని వసూలు చేయనుంది. పెరిగిన బస్సు ఛార్జీలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది.
ప్రస్తుతం సిటీ బస్సు మొదటి స్టేజ్‌ వరకు చార్జీ రూ. 10గా ఉంటే ఇప్పుడు దానిపై మరో రూ. 5 పెంచడంతో అది రూ. 15 చేరింది. నాలుగో స్టేజీ నుంచి అదనంగా రూ. 10 వసూలు చేయనుంది. అంటే రూ.20 నుంచి రూ.30 పెరగనుంది. మహాలక్ష్మి ఉచిత ప్రయాణం వచ్చాక రోజుకు 26 లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు అంచనా. గతంలో 11 లక్షల వరకు ప్రయాణించేవారు. ఇప్పటికే విద్యార్థుల బస్‌ పాస్‌లు, టీ-24 టికెట్‌ చార్జీలు పెంచిన ఆర్టీసీ.. ఇప్పుడు ప్రయాణికులపై భారం మోపడానికి సిద్ధమైంది.
కాగా హైదరాబాద్‌ నగరంలో ప్రస్తుతం 2,800 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. రోజుకు 30వేల ట్రిప్పులు కొనసాగుతున్నాయి. 25 డిపోలున్నాయి. 265 ఎలక్ట్రిక్‌ బస్సులున్నాయి. ఈ ఏడాది మరో 275 రానున్నాయి.
2027 నాటికి 2,800 కొత్త ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం 19 డిపోల్లో ఛార్జింగ్‌ కోసం హెచ్‌టీ కనెక్షన్లు కావాలి. కొత్త, డిపోలు, ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు వీటన్నింటికీ కలిపి రూ.392 కోట్ల మేర వ్యయం అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఆర్థిక భారాన్ని మోయలేక సిటీ బస్సుల ఛార్జీని పెంచినట్లు ఆర్టీసీ స్పష్టం చేసింది.
Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *