Revanthreddy: సాగర్ వివాదం కేసీఆర్ కుట్రలో భాగమేనన్న రేవంత్ రెడ్డి
Revanthreddy: నాగార్జున సాగర్ వివాదంపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కావాలనే నాగార్జునసాగర్ వివాదం తెరపైకి తెచ్చారని, దింపుడు కళ్లం ఆశలతో కేసీఆర్ చివరి ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
Revanthreddy: తెలంగాణలో ఇన్నాళ్లు లేని సాగర్ సమస్య ఇప్పుడే గుర్తొంచ్చిందా? అని తెలంగాణ పిసిసి అధ్యక్షుడుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వ్యూహాత్మకంగా వివాదాన్ని సృష్టించారని, రెండు దేశాలే నీటి సమస్య పరిష్కరించు కుంటున్నప్పుడు రెండు రాష్ట్రాల మధ్య సాధ్యం కాదా అన్నారు. సాగర్ వివాదంపై సీఈవో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ సమస్యల పరిష్కారానికి కేసీఆర్ ఎప్పుడుప్రయత్నించలేదని, కేసీఆర్ వెళ్లిపోయే సిఎం అని, ఆయనకు వ్యక్తిగత ఆసక్తులు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. సాగర్ వివాదాన్ని వ్యూహాత్మకంగా సృష్టించారని సాగర్ ప్రాజెక్టు ఎక్కడికి పోదని, పోలింగ్కు ముందు ఇలాంటి అంశాలను తెర లేపడానికి ఎవరు, ఎందుకు, ఏమి ఆశించి చేస్తున్నారో ప్రజలకు తెలుసన్నారు.
తెలంగాణ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రాజెక్టుతో పాటు దాని గేట్లు అక్కడే ఉంటాయన్నారు. ఈసీ సీఈఓ బాధ్యత తీసుకుని చర్యలు చేపట్టాలన్నారు. తొమ్మిదిన్నరేళ్లుగా సమస్యలు పరిష్కరించకపోవడం వల్ల ఇలాంటి ఘర్షణలు తలెత్తుతున్నాయన్నారు.
రానున్న కాంగ్రెస్ ప్రభుత్వం మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్తో సామరస్యంగా నదీ జలాల వివాదాలను పరిష్కరించుకుంటామని చెప్పారు. పాకిస్తాన్తో వివాదాలే పరిష్కారం అవుతున్నాయని రాష్ట్రాల వివాదాలు కూడా పరిష్కారం అవుతాయన్నారు.
కృష్ణా,గోదావరి జలాల వివాదాలతో పాటు ఆస్తుల వివాదాలను కూడా ఆంధ్రాతో పరిష్కరించు కుంటామన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కుట్రల్లో పడొద్దన్నారు. ఇలాంటి కుట్రల్లో తెలంగాణ ప్రజలు చిక్కుకోవద్దన్నారు. ప్రజలు ఎన్నుకున్న రెండు ప్రభుత్వాలు సరైన పరిష్కారం చూపిస్తాయని ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.
అవసరమైనపుడు సెంటిమెంట్గా రాజకీయాలకు ఉపయోగించుకునేలా పన్నాగాలు పన్నుతున్నారన్నారు. కేసీఆర్ ఆఖరి ప్రయత్నంగా, దింపుడు కళ్ళం ఆశలుగా ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారన్నారు. అన్ని సమస్యలను కాంగ్రెస్ పార్టీ పరిష్కరిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.