Crime: దారుణం.. కన్న కూతురినే కాల్చి చంపిన తండ్రి

 Crime: దారుణం.. కన్న కూతురినే కాల్చి చంపిన తండ్రి

హర్యాణాలోని గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. రాష్ట్రస్థాయి టెన్నిస్ క్రీడాకారణి అయిన రాధికా యాదవ్ (25)ను కన్న తండ్రే కాల్చి చంపాడు. ఆమె సోషల్ మీడియాలో రీల్‌ చేయడంతో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన హత్య చేసినట్లు తెలుస్తోంది.

హర్యాణాలో దారుణం జరిగింది. ఓ టెన్నిస్ క్రీడాకారిణిని కన్న తండ్రే కాల్చి చంపడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రస్థాయి టెన్నిస్ క్రీడాకారణి అయిన రాధికా యాదవ్ (25) గురుగ్రామ్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటోంది. గురువారం ఆమె ఇంట్లో వంట చేస్తోంది. ఈ సమయంలోనే తండ్రి దీపక్ యాదక్‌ వెనక నుంచి ఆమెపై తుపాకితో కాల్పులు జరిపాడు.

ఐదు రౌండ్లకు పైగా కాల్పులు జరిపాడు. దీంతో రాధిక ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే రాధిక సోషల్ మీడియాలో రీల్‌ చేయడంతో దీనిపై తండ్రితో వివాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన తండ్రి కూతురిని కాల్చి చెప్పినట్లు ప్రచారం నడుస్తోంది. మరోవైపు ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *