అనంతపురం: భర్త గ్యాస్ సిలిండర్ తేలేదని భార్య ఆత్మహత్యాయత్నం భర్త గ్యాస్ సిలిండర్ తీసుకురాలేదనే కారణంతో భార్య ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన.. అనంతపురం జిల్లా గుత్తి మండలంలో చోటుచేసుకుంది. తొండపాడు గ్రామానికి చెందిన మహాలక్ష్మి అనే మహిళ.. తన భర్త మూడు నెలలుగా గ్యాస్ సిలిండర్ తేలేదనే కోపంతో ఆత్మహత్యకు యత్నించింది. తాను ఎంతగా చెప్తు్న్నా సిలిండర్ తేవటం లేదనే మనస్తాపంతో మహాలక్ష్మి బలవన్మరణానికి యత్నించారు. అయితే కుటుంబసభ్యులు సకాలంలో గుర్తించి ఆస్పత్రికి తరలించటంతో.. ప్రాణాలతో బయటపడ్డారు. […]Read More
తిరుపతి జిల్లా సత్యవేడు మండలం నరసరాజు అగ్రహారంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. పాల కోసం ఏడుస్తోందని ఆరు నెలల పాపను కన్నతల్లే దారుణంగా చంపేసిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పాల కోసం గుక్కపట్టి ఏడుస్తున్న పసిపాపను పాలిచ్చి, ఊరడించాల్సిన తల్లి.. క్షణికావేశంలో తన పేగుబంధాన్ని తానే చేజేతులా చేసుకున్న వైనం.. ఆ కన్నతల్లి ఉన్మాదం స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ ఘటనలో చిన్నారి తల్లి హైమావతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Mother Kills Baby for Crying for […]Read More
కరీంనగర్ పోలీస్ శాఖలో విషాదం.. భార్య మరణించిన ఐదు రోజుల్లోనే ఎస్సై ఆత్మహత్య..!
కరీంనగర్ పోలీస్ శాఖలో విషాదం.. భార్య మరణించిన ఐదు రోజుల్లోనే ఎస్సై ఆత్మహత్య..! కరీంనగర్ టూ టౌన్ ఎస్సై చంద్రశేఖర్ సూసైడ్ చేసుకున్నాడు. తన భార్య దివ్య ఆత్మహత్య చేసుకున్న ఐదు రోజులకే ఆయన సైతం బలవన్మరణానికి పాల్పడ్డారు. భార్య మరణం కలిగించిన వేదన, బంధువుల నిందలు భరించలేక అత్తగారి ఇంట్లోనే ఆయన ఉరివేసుకున్నట్లు తెలిసింది. ఐదు రోజుల వ్యవధిలో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. హైలైట్: కరీంనగర్ పోలీస్ శాఖలో విషాదం భార్య […]Read More
Hyderabad: మహిళా వ్యాపారవేత్తకు సైబర్ కేటుగాళ్ల టోకరా.. రూ.1.20 కోట్లు స్వాహా..
Hyderabad: మహిళా వ్యాపారవేత్తకు సైబర్ కేటుగాళ్ల టోకరా.. రూ.1.20 కోట్లు స్వాహా.. హైదరాబాద్లో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. దివ్యారెడ్డి దొడ్ల అనే మహిళా వ్యాపారవేత్తకు సైబర్ కేటుగాళ్లు 1.20 కోట్లు టోకరా వేశారు. ఫేక్ వాట్సాప్ అకౌంట్ నుంచి దివ్యారెడ్డి అకౌంటెంట్కు మెసేజ్ పంపించి మోసం చేశారు. తాను మీటింగ్లో ఉన్నానని, తాను చెప్పిన బ్యాంక్ ఖాతాకు డబ్బులు పంపించాలని ఆ మెసేజ్లో ఉండటంతో.. అకౌంటెంట్ అదే పనిచేశారు. అయితే మార్చి 17న మరోసారి ఇలాంటి […]Read More
‘మీ బండిపై పెండింగ్ చలాన్లు ఉన్నాయా..? అయితే ఈనెల 14న లోక్ అదాలత్లో 80 శాతం డిస్కౌంట్తో క్లియర్ చేసుకోవచ్చు.’ అంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్గా మారాయి. ఈ వైరల్ వీడియోలపై తాజాగా హైదరాబాద్ సీపీ క్లారిటీ ఇచ్చారు. పోలీస్ శాఖ, ప్రభుత్వం నుంచి ఎలాంటి డిస్కౌంట్ ప్రకటించలేదని అన్నారు. అదంతా ఫేక్ న్యూస్ అని వ్యూస్ కోసం కొందరు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఫైరయ్యారు. హైలైట్: పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై 80 […]Read More