BIG BREAKING: మా నాన్న కాదు నేనొస్తా.. రేవంత్ కు ఎమ్మెల్సీ కవిత సంచలన సవాల్!

 BIG BREAKING: మా నాన్న కాదు నేనొస్తా.. రేవంత్ కు ఎమ్మెల్సీ కవిత సంచలన సవాల్!

మహిళలకు నెలకు రూ.2,500 ఎందుకు ఇస్తలేరో చర్చ చేద్దామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. మహిళలు అందరం మీ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చర్చకు రావడానికి సిద్ధమన్నారు. తులం బంగారం, పింఛన్లు పెంపుపై చర్చిద్దామన్నారు.

సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. పదే పదే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని సీఎం రంకెలు వేస్తున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ పాలిటిక్సేనని ధ్వజమెత్తారు. మేం మహిళలు అందరం మీ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వస్తాం.. మహిళలకు నెలకు రూ.2,500 ఎందుకు ఇస్తలేరో చర్చ చేద్దామని సవాల్ విసిరారు. ఎందుకు తులం బంగారం ఇస్తలేరో, ఎందుకు పింఛన్లు పెంచడం లేదో చర్చిద్దామన్నారు. మీ మోసాలను ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకోవాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు.

గత కొన్ని రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్ లో యాక్టీవ్ గా ఉంటున్న కవిత ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు. భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉండి ఏపీలో కలిసిన ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. ఐదు గ్రామ పంచాయతీలు అయిన ఏటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలన్నారు.

ఈ రోజు కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కవిత పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ పై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రికి వాస్తు భయం ఉందన్నారు. దీంతో సచివాలయానికి కూడా రావడం లేదన్నారు. కానీ, మీడియా ముందు సవాళ్లు విసురుతూ హద్దులు మీరుతున్నారని ధ్వజమెత్తారు. బీసీలకు మద్దతుగా 22న రైలు రోకో చేపట్టనున్నట్లు చెప్పారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *