Devotional

పుట్టమీద కొట్ట చచ్చునా సర్పంబు?

శ్రీ శుక ఉవాచ.. పరీక్షిన్మహారాజా! వైవస్వత మనువు పదిమంది పుత్రులలో పెద్దవాడు ఇక్ష్వాకుడు. దినమణి- సూర్యవంశానికి మణిమకుటం వంటి మహారాజు. ఈ మహాపురుషుని పేరు మీదే శ్రీరాముడు ‘ఇక్ష్వాకు కుల తిలకుడు’ అని ప్రఖ్యాతి పొందాడు. ఇక్షాకుని పౌత్రుడు కకుత్‌స్థుడు. సురాసుర సమరంలో వృషభ (ఆబోతు) రూపం ధరించిన అమరేంద్రుని కకుదాన్ని- మూపురాన్ని అధిరోహించి అసుర సంహారం చేసి అమరులకు ఆనందం కలిగించాడు. అందుకే ‘కకుత్‌స్థుడు’ అన్న పౌరుష నామం ఇతని పట్ల ప్రసిద్ధమైంది. ఈ వీరుని […]Read More

Devotional EDITORS'S PICKS

శ్రావణంలో చేసినట్లు అధిక మాసంలో కూడా వ్రతాలు ఆచరించాల్సిందేనా?

Shravana Masam 2023 |‘ద్వాదశేష్వపి మాసేషు, శ్రావణః శివరూపకః’ అంటే ‘పన్నెండు నెలల్లో శ్రావణ మాసం శివరూపం, సాక్షాత్తు నేనే శ్రావణ మాసం’ అని సనత్కుమారుడికి చెబుతాడు పరమేశ్వరుడు. అలాంటి పవిత్ర శ్రావణ మాసం ఈ ఏడాది రెండుసార్లు వస్తున్నది. అధిక మాసంలో నిజ శ్రావణ మాసంలా వ్రతాలు ఆచరించాల్సిన సంప్రదాయం లేదు. కానీ, అధిక మాసంలో చేసే దానాలు, జపాలు అధిక ఫలాన్ని ఇస్తాయని పెద్దల మాట. ఈ క్రమంలో పవిత్రమైన శ్రావణం అధిక మాసంగా […]Read More

Devotional

తిరుమల భక్తులకు గుడ్‌ న్యూస్‌.. 25న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల అదనపు

తిరుమల : తిరుమల (Tirumala) లో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ (TTD ) గుడ్‌ న్యూస్‌ తెలిపింది. ఆగస్టు, సెప్టెంబరు నెల‌లకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల అదనపు కోటా (Additional Quota)ను జూలై 25న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. అదేవిధంగా అదే రోజు అక్టోబరు (October) కోటాను కూడా విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. తిరుమ‌ల శ్రీ‌వారి అంగప్రదక్షిణ టికెట్లకు సంబంధించిన అక్టోబరు నెల కోటాను […]Read More

Devotional

తిరుమలలో అన్ని కంపార్ట్‌మెంట్లు ఫుల్‌.. సర్వదర్శనానికి 15 గంటల సమయం

తిరుమల : వారాంతపు సెలవుదినం కావడంతో ఆదివారం తిరుమల ( Tirumala )లో భక్తుల రద్దీ పెరిగింది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమలలోని కంపార్ట్‌మెంట్లు ( Compartments ) అన్నీ నిండి ఏటీసీ వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి (Sarvadarsan ) 15 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న శ్రీవారిని 84,430 మంది భక్తులు దర్శించుకోగా 38,662 మంది […]Read More

Devotional

పశ్చాత్తాపమే నిజమైన ప్రాయశ్చిత్తం

బాదరాయణి శుకముని పరీక్షిత్‌ భూరమణునితో ఇలాగని వినిపించాడు.. రాజా! విధాత విధానం అలా ఉన్నదని సమాధానపడి మాంధాత తన కన్యలు ఏబది మందిని అనన్య తపశ్శక్తి భరితుడైన సౌభరికిచ్చి వైభవోపేతంగా సరయూ నదీతీరంలో వివాహాలు జరిపించాడు. మహర్షి తన తపోమహిమతో అనేక లీలా వినోదాలను కల్పించి, హాలాపాన మదమత్తుని వలె పంచాశత్‌ (యాభై) బాలా(కాంతా) మణుల చూపుల సంకెళ్లలో చిక్కుకొని కేళీ విలాసాలలో జీవిత కాలాన్ని వాలాయము- నిరంతరంగా వృథా చేసుకుంటూ చాలా దిగజారిపోయాడు. కం॥ ‘పెక్కండ్రు […]Read More

Devotional

ఉదయిస్తుండగానే అర్ఘ్యం!

సూర్య నమస్కారాలు ఏ సమయంలో చేయాలి? అరుణోదయ వేళ సూర్యుడు పూర్తి స్థాయిలో వెలుగుచూడకముందు అర్ఘ్యప్రదానం ఇవ్వకూడదన్నారు ఎందుకు? అర్ఘ్యం ఏ సమయంలో ఇవ్వాలి తెలియజేయండి? రాధిక, హైదరాబాద్‌ ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్‌- ఆదిత్యుణ్ని ఉపాసించడం వల్ల ఆరోగ్యం సమకూరుతుందని శాస్త్ర వచనం. ప్రత్యక్ష దైవమైన సూర్యుడికి నమస్కారం చేయడం వల్ల ఐహిక, ఆముష్మిక (పరలోక) ప్రయోజనాలు కలుగుతాయి. భానూదయ సమయంలో సూర్య నమస్కారాలు చేయాలి. లేలేత సూర్యకిరణాలు శరీరంపై ప్రసరించడం ఆరోగ్యప్రదం. ఉదయం ఏ ఆహారం తీసుకోకముందు […]Read More

Devotional

పవిత్ర మాసం.. ఉపవాసం కోసం!

ఇస్లామిక్‌ కాలదర్శినిలో ముహర్రమ్‌ మొదటి నెల. ఖురాన్‌లో పేర్కొన్న నాలుగు పవిత్ర నెలల్లో ఇదీ ఒకటి. ముహర్రమ్‌ నెలవంక దర్శనంతో ఇస్లామిక్‌ నూతన సంవత్సరం మొదలవుతుంది. ఇది అల్లాహ్‌ నెలగా ప్రసిద్ధి చెందింది. ముహర్రమ్‌ అంటే నిషిద్ధం, పవిత్రత, మహోన్నతనం అనే అర్థాలున్నాయి. ఈ నెల గొప్పదనాన్ని అల్లాహ్‌ ఖురాన్‌లో గొప్పగా వర్ణించాడు. ‘రమజాన్‌ నెల తరువాత ముహర్రమ్‌ నెల ఉపవాసాలు ప్రముఖమైనవి. రమజాన్‌ తర్వాత ఉపవాసాలు పాటించాలని భావించేవారికి ముహర్రమ్‌ సరైన మాసం. ఇది అల్లాహ్‌ […]Read More

Devotional

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం

తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తిరుమల (Tirumala ) కొండకు చేరుకుంటున్నారు. దీంతో కొండపై ఉన్న 15 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం ( Sarvadarsan ) కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 73, 796 మంది భక్తులు దర్శించుకోగా 28,840 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం ( […]Read More

Devotional

ఆగస్టు నెలలో తిరుమలలో నిర్వహించే విశేష ఉత్సవాలు ఇవే.. !

తిరుమల : తిరుమల ( Tirumala ) శ్రీ  వేంకటేశ్వర స్వామికి ఏటా నిర్వహించే ఉత్సవాలతో పాటు మాసం వారిగా జరిపే విశేష ఉత్సవాలను టీటీడీ అధికారులు వెల్లడించారు. దీనిలో భాగంగా ఆగస్టు నెలలో జరిగే ఉత్సవాల వివరాలను ప్రకటించారు. తిరుమల దిగువన తిరుపతిలో శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ఆగస్టు నెలలో జరిగే ఉత్సవాలను సైతం వెల్లడించారు. తిరుమలలో ఆగస్టు 1న పౌర్ణమి గరుడ సేవ (Garuda Seva), ఆగస్టు 12న మతత్రయ ఏకాదశిని నిర్వహిస్తున్నట్లు […]Read More

Devotional

ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు శ్రీవారి పుష్కరిణి మూసివేత

తిరుమల : తిరుమ‌లలో శ్రీ‌వారి ఆల‌యం వద్ద గల పుష్కరిణిని (Pushkarini ) నెలరోజుల పాటు మూసివేస్తున్నామని టీటీడీ అధికారులు (TTD Officers) వెల్లడించారు. పుష్కరిణీలో ఉన్న నీటిని తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు పుష్కరిణిని మూసివేస్తున్నామని తెలిపారు. ఈ నెల రోజుల పాటు పుష్కరిణికి హార‌తి ఉండ‌దని వివరించారు. సాధారణంగా స్వామి పుష్కరిణిలో నీరు నిల్వ ఉండే అవ‌కాశం లేదని, పుష్కరిణిలోని నీటిని శుద్ధి […]Read More