Political News

అమరావతిని ఏపీ రాజధానిగా కేంద్రం గుర్తించేలా చర్యలు… జూన్‌ 2తో ముగిసిన ఉమ్మడి

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతి నగరాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి గెజిట్ జారీ చేసేలా చర్యలు చేపడతామని మంత్రి నారాయణ స్పష్టత ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి రాజధాని గడువు జూన్‌2తో పూర్తైన నేపథ్యంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి అని పార్లమెంటు లో కేంద్రం గతంలోనే స్పష్టం గా చెప్పిందని, కేంద్రం అధికారిక గెజిట్ ను జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి నారాయణ ప్రకటించారు. […]Read More

Political News

ఐదేళ్ళల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం..సీఎం చంద్రబాబు

ఒకేసారి ఆరు కొత్త పాలసీలను తీసుకొచ్చాం అని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.ఎలక్ట్రానిక్స్‌, ఇండస్ట్రియల్‌, క్లీన్‌ ఎనర్జీ, గ్రీన్‌ ఎనర్జీ, పర్యాటక, ఐటీ వర్చువల్ వర్కింగ్ పాలసీలతో ఐదేళ్ళల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు వెళతామని చెప్పారు. ఈరోజు ఏపీ కేబినెట్ మీటింగ్ సమావేశం అయింది. దీని తరువాత సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఎలక్ట్రానిక్స్‌, ఇండస్ట్రియల్‌, క్లీన్‌ ఎనర్జీ, గ్రీన్‌ ఎనర్జీ పాలసీలు…పర్యాటక, ఐటీ వర్చువల్ వర్కింగ్ పాలసీలతో ఐదేళ్ళల్లో […]Read More

Political News

అదానీకి ఊహించని షాక్.. రూ.16 కోట్ల జరిమానా, 5ఏళ్ల జైలు శిక్ష

అదానీపై తాజాగా అమెరికాలో కేసు నమోదు అయింది. ఈ తరుణంలో ఈ కేసులో అదానీ నేరం చేసినట్లు రుజువైతే 2 మిలియన్ డాలర్ల (రూ.16 కోట్ల 88 లక్షల 62 వేల 583) జరిమానా విధిస్తారు. అంతేకాకుండా 5 ఏళ్ల జైలు శిక్ష సైతం విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇండియాలోనే ధనవంతుల జాబితాలో అదానీ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. అలాంటి అదానీపై తాజాగా అమెరికాలో కేసు నమోదు అయింది. ఏకంగా అమెరికా నుంచి అరెస్ట్ […]Read More

Political News

Big Breaking: జనవరిలో పంచాయతీ ఎన్నికలు..?

యావత్తు తెలంగాణ ఎదురుచూస్తున్న పంచాయతీ ఎన్నికలు జనవరిలో నిర్వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. డిసెంబర్ చివరి వారంలోనే షెడ్యూల్ విడుదల చేసి.. జనవరి 7వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చే చాన్స్ ఉన్నట్లు సమాచారం.ఎప్పుడెప్పుడా అని  తెలంగాణ మొత్తం  ఎదురుచూస్తున్న పంచాయతీ ఎన్నికలు జనవరిలో నిర్వహించే అవకాశాలున్నాయని సమాచారం. డిసెంబర్ చివరి వారంలోనే షెడ్యూల్ విడుదల చేసి.. జనవరి 7వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చే సూచనలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. పంచాయతీ ఎన్నికలను ఈ సారి మూడు దశల్లో నిర్వహించేలా […]Read More

Movie News

నాగచైతన్యతో మీనాక్షి చౌదరి రొమాన్స్

‘తండేల్’ సినిమా తర్వాత నాగ చైతన్య ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌద‌రిని ఎంచుకొన్న‌ట్టు ఇన్ సైడ్ టాక్. మీనాక్షి.. చైతూ ప‌క్క‌న న‌టించ‌డం ఇదే తొలిసారి కావడంతో ఈ కాంబోపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలుగు హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటోంది. ఇటీవలే ‘లక్కీ భాస్కర్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న ఈ […]Read More

Political News

ఏపీ రైతులు ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.20వేలు.. అన్నదాత సుఖీభవ పథకంపై మరో కీలక

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు అందిస్తామన్నారు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు. శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు..అన్నదాత సుఖీభవ పథకంపై కీలక ప్రకటన చేశారు. ప్రతి ఏటా అర్హులైన రైతులందరికి రూ.20 వేలు అందజేస్తామని.. ఇందులో పీఎం కిసాన్ రూ.6 వేలు.. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.14 వేలు కలిపి ఇస్తామని చెప్పారు. 41.4 లక్షల మంది రైతులకు ఈ పథకం అందిస్తామని.. ఇందుకోసం […]Read More

Political News

వైద్యుల నిర్లక్ష్యం.. ప్రైవేట్ ఆసుపత్రికి రూ.30 లక్షల జరిమానా

వైద్యుల నిర్లక్షం వల్ల భువనగిరిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి గుంటూరు వినియోగదారుల ఫోరం రూ. 30 లక్షల జరిమానా విధించింది. ఓ వ్యక్తికి కడుపులో ఇన్ఫెక్షన్ సోకగా.. రాళ్లు ఉన్నాయని ఆపరేషన్ చేశారు. కానీ తర్వాత అతను మరణించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల భువనగిరిలోని ఓ ఆసుపత్రికి గుంటూరు వినియోగదారుల ఫోరం రూ.30 లక్షల జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు ఆర్టీసీ కాలనీలోని గాంధీ నగర్‌లో షేక్ జానీ నివసిస్తున్నాడు. ఇతను […]Read More

Political News

TG Ration Card: తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న వారికి బిగ్ షాక్

తెలంగాణలో తెల్ల రేషన్ కార్డ్ లబ్ధిదారులకు నిరాశ ఎదురయ్యే అవకాశముంది. సంక్రాంతి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినా.. మరో మూడు నెలలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో ముందుగా ప్రకటించినట్లు సంక్రాంతికి కాకుండా ఉగాది పండగ తర్వాతే సన్న బియ్యం పంపిణీ చేసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. జనవరి నుంచి ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ.. తాజాగా మూడు నెలల పాటు ఆగాలని భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర పౌరసరఫరాల […]Read More

Political News

ఖమ్మంలో కల్తీ దందా.. ఆ ఫేమస్ అల్లం, స్వీట్లు ఎలా తయారు చేస్తున్నారో

ఖమ్మంలో ఆహార, స్వీట్ తయారీ కేంద్రాలపై రాష్ట్ర ఫుడ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. 960 కేజీల క్వాలిటీ లేని అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ పాకెట్లను సీజ్ చేశారు. నిబంధనలు, అనుమతులు లేని వ్యాపారాలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కల్తీ దందాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో మరో ఘటన కలకలం రేపుతుంది. నిన్న ఆహార, స్వీట్ తయారీ కేంద్రాలపై రాష్ట్ర ఫుడ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు […]Read More

Political News

108 సర్వీసులకు గడ్డుకాలం.. డీజిల్ కు డబ్బుల్లేక నిలిచిన సేవలు

ఏపీలో అంబులెన్స్ సర్వీసులకు గడ్డుపరిస్థితులు ఏర్పడ్డాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 108 సేవలు నిలిచిపోయాయని, అధికారులను ప్రశ్నిస్తే డీజిల్ కు డబ్బుల్లేక నిలిపి వేసినట్లు చెబుతున్నారని వాపోతున్నారు. పేద ప్రజలకు సంజీవదాయనిగా ఉన్న అంబులెన్స్ సర్వీసులకు గడ్డుపరిస్థితులు ఏర్పడ్డాయని ఏపీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 108 సేవలు నిలిచిపోయాయని, ఏలూరు జిల్లాలో ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న 29 అంబులెన్స్ సర్వీసులుండగా.. ప్రస్తుతం దాదాపు 10 సర్వీసులు అధికారులు నిలిపేశారంటూ ఆదేవన చెందుతున్నారు. జిల్లాలో జంగారెడ్డిగూడెం […]Read More