Ts Crime: భర్తను చంపితే 15 లక్షలు, అడ్వాన్స్ 2 లక్షలు.. భార్య షాకింగ్ ఆఫర్!

కామారెడ్డి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. వివాహిత రేణుక ప్రియుడి కోసం భర్తను చంపేందుకు 15 లక్షల సుపారీ ఇచ్చింది. అదృష్టవశాత్తు భర్త కుమార్ గాయాలతో తప్పించుకున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విషయం తెలుసుకున్న పోలీసులు భార్యతో సహా ఇతర నిందితులను అరెస్టు చేశారు.
s Crime: కామారెడ్డిలో మరో కిరాతక భార్య బాగోతం వెలుగు చూసింది. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను చంపేందుకు ఏకంగా 15 లక్షల సుపారీ ఇచ్చింది. 2 లక్షల అడ్వాన్స్ కూడా ముట్టజెప్పింది. కానీ ఈమె ప్లాన్ ఫలించలేదు. చివరికి సుపారీ గ్యాంగ్ తో సహా అరెస్టై జైలుకు వెళ్ళింది. ఈ స్టోరీ గురించి తెలియాలంటే ఆర్టికల్ మొత్తం చదవండి.
ఘన్పూర్ గ్రామానికి చెందిన సాడెం కుమార్ మేడ్చల్ జిల్లాలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. అయితే అతడి భార్య రేణుక సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి లలితమ్మ గుడి పూజారి మహేశ్తో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం భర్త కుమార్ కి తెలియడంతో.. దీనిపై తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి.