AP: 7కిలోల విలువైన బంగారంతో ఉడాయించిన డ్రైవర్

 AP: 7కిలోల విలువైన బంగారంతో ఉడాయించిన డ్రైవర్

నమ్మకంగా ఉన్నట్టు నటించాడు. భరోసా ఇచ్చి బంగారం తీసుకెళ్ళాడు. పక్కా ప్రణాళిక ప్రకారం తరువాత వాటితో పరారయ్యాడు. హైదరాబాద్ నుంచి విజయవాడలో దుకాణానికి 10 కోట్ల విలువైన బంగారం ఇవ్వడానికి వెళుతున్న డ్రైవర్ పరారయ్యాడు.

ఎన్టీయార్ జిల్లా జగ్గయ్యపేటలో ఓ కారు డ్రైవర్ 7 కిలోల బంగారంతో ఉడాయించాడు. తన యజమాని నగల వ్యాపారి రోడ్డు పక్కన టీ తాగుతుండగా కారుతో సహ పరారయ్యాడు. ఆ తరువాత కారును నందిగామ మునగచెర్ల దగ్గర వదిలి బంగారంతో పారిపోయాడు.

పక్కా ప్లాన్ ప్రకారం…

బీఎన్ఆర్ జ్యుయలరీకి చెందిన నగల వ్యాపారి కిషన్‌ లాల్  హైదరాబాద్ నుంచి విజయవాడకు ముగ్గురు వ్యక్తులతో బయలుదేరాడు. విజయవాడలో నగలు డెలివరీ ఇవ్వాలి. జగ్గయ్యపేట వరకు వచ్చాక అక్కడ ఆటోనగర్‌‌ దగ్గరలో ఓ హోటల్ లో టీ తాగేందుకు ఆగారు. వ్యాపారి కిషన్‌ లాల్‌తో సహా మిగిలిన ముగ్గురు వ్యక్తులూ టీ తాగేందుకు దిగారు. ఇదే అదనుగా భావించిన డ్రైవర్ జితేష్ కారుతో ఉడాయించాడు. అది చూసిన కిషన్ గట్టిగా కేకలు వేశారు. కానీ అప్పటికే జితేష్ కారుతో మాయం అయిపోయాడు. వెంటనే వ్యాపారి జగ్గయ్య మండలం చిలకలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *