కేంద్రం కొత్త స్కీమ్.. ఒక్కొక్కరికి రూ. 60 వేలు..

 కేంద్రం కొత్త స్కీమ్.. ఒక్కొక్కరికి రూ. 60 వేలు..

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘పీఎం ఇంటర్న్‌షిఫ్ ప్రోగ్రామ్’ కొత్త స్కీమ్‌ను ప్రకటించింది. దీనికి సెలక్ట్ అయిన అభ్యర్థులకు ఒక్కొక్కరికి నెలకు రూ.5000 చొప్పున సంవత్సరానికి రూ.60,000 స్టైఫండ్ అందించనున్నారు. డిసెంబర్ నుంచి ఇంటర్న్‌షిప్‌లు ప్రారంభించనున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల 2024-25 పూర్తి స్థాయి బడ్జెట్‌లో ‘పీఎం ఇంటర్న్‌షిఫ్ ప్రోగ్రామ్’ కొత్త స్కీమ్‌ను ప్రకటించింది. యువతలో నైపుణ్యాన్ని పెంపొందించి, వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దీంతో ఈ ‘పీఎం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్’కు సెలక్ట్ అయిన అభ్యర్థులకు ఒక్కొక్కరికి నెలకు రూ.5000 చొప్పున సంవత్సరానికి రూ.60,000 స్టైఫండ్ అందించనున్నారు.

కాగా ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. రానున్న ఐదు ఏళ్లలో టాప్ 500 సంస్థల్లో దాదాపు కోటి మందికి నైపుణ్యాలు కల్పించడం. దీనిని రూ.800 కోట్ల ఖర్చుతో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. వచ్చే నెల అంటే డిసెంబర్ నుంచి ఇంటర్న్‌షిప్‌లు అందివ్వనున్నారు.

ఇక ఇంటర్న్‌షిప్‌లో చేరే వారికి వ్యక్తిగత బీమా ఉంటుంది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా ఇన్సూరెన్స్ కల్పించనున్నారు. దీనికోసం అప్లై చేసుకోవాలని ఆసక్తి ఉన్న వారు 21 ఏళ్ల నుంచి 24 ఏళ్ల వయస్సు మధ్య ఉండాలి. ఇక విద్యార్హత విషయానికొస్తే.. SSC పాసైన అభ్యర్థులు, ఐటీఐ, పాలిటెక్నిక్, బీఎస్సీ, బీఫార్మసీ, బీఏ, బీబీఏలో ఉత్తీర్ణులై ఉండాలి. నవంబర్ 10వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *