గోంగూర చేపల పులుసు రెసిపీ
గోంగూర చేపల పులుసు రెసిపీకి కావలసిన పదార్థాలు
చేపలు – ఒక కిలో
గోంగూర – ఒక కట్ట
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను
పసుపు – పావు స్పూన్
కారం – మూడు స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
జీలకర్ర – ఒక స్పూను
ఆవాలు – ఒక స్పూను
ఎండుమిర్చి – మూడు
ఉల్లిపాయ – ఒకటి
ధనియాల పొడి – ఒక స్పూను
మెంతి పిండి – అర స్పూను
గరం మసాలా – ఒక స్పూను
టమాటా – రెండు
నీరు – తగినంత
కొత్తిమీర తరుగు – మూడు స్పూన్లు
నూనె – సరిపడినంత
గోంగూర చేపల పులుసు రెసిపీ
1. చేప ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకోవాలి
. అందులోనే పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
3. ఒక గంట సేపు వాటిని అలా వదిలేయాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
5. చేపలు వేయించడానికి సరిపడా నూనెను వేసుకోవాలి.
6. నూనె వేడెక్కాక ఒక్కొక్క చేప ముక్కను రెండు వైపులా ఎర్రగా కాల్చి పక్కన పెట్టుకోవాలి.
7. ఇప్పుడు అదే కళాయిలో మరి కాస్త నూనె వేయాలి.
9. తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలను సన్నగా తరిగి చిన్న ముక్కలుగా కోసి వేయించాలి.
11. ఇప్పుడు గోంగూరను చిన్నగా తరిగి శుభ్రంగా కడిగి ఆకులను కూడా కళాయిలో వేసి బాగా కలపాలి.
12. మూత పెడితే అవి త్వరగా మగ్గుతాయి.
13. తర్వాత మూత తీసి పసుపు, కారం, మెంతి పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
14. టమాటాలను మిక్సీలో వేసి ఫ్యూరీ లాగా చేసుకోవాలి.
15. ఆ ప్యూరీని కూడా వేసి బాగా కలపాలి. చిన్న మంట మీద అరగంట పాటు ఉడికిస్తే నూనె పైకి తేలుతుంది.
16. ఆ సమయంలో నీళ్లు వేయాలి. పులుసు బుడగలు వస్తున్నట్టు మరుగుతూ ఉంటుంది.
17. ఆ సమయంలోనే ముందుగా వేయించుకున్న చేప ముక్కలను వేయాలి.
18. మూత పెట్టి పావుగంట సేపు ఉడికిస్తే సరిపోతుంది. చేప ముక్కలను గరిటతో కలపకూడదు.
20. స్టవ్ కట్టే ముందు కొత్తిమీర చల్లుకోవాలి. చేపల కూర చల్లారే వరకు అలా ఉంచాలి.