15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీపై ప్రకటన

 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీపై ప్రకటన

బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంద్రవెల్లి సభలో మాట్లాడిన ఆయన… వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేస్తామన్నారు.

ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన తెలంగాణ పునర్నిర్మాణ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాట ఇచ్చిన ప్రకారం ఆదిలాబాద్‌ జిల్లాను దత్తత తీసుకుంటామన్నారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటున్నామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ విధ్వంసానికి గురైందన్నారు. నాగోబా ఆలయాన్ని గత ప్రభుత్వం ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *