Revanth Reddy: తెలంగాణ గ్రూప్-2 ఎగ్జామ్పై క్లారిటీ వచ్చేసింది.. సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..?
Telangana Jobs : తెలంగాణలో ఉద్యోగ నియామక ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే.. ఇదే క్రమంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ సైతం రాజీనామా చేశారు.
Telangana CM Revanth Reddy – TSPSC Group 2 Exam : తెలంగాణలోని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్న్యూస్ చెప్పారు. త్వరలోనే టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి మంత్రులతో కలిసి రేపటి నుంచి ప్రారంభం కాబోయే ప్రజాపాలన కార్యక్రమం దరఖాస్తులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
అనంతరం ఉద్యోగ నియామకాలు చేపడతాం. టీఎస్పీఎస్సీ గ్రూప్- 2 పరీక్షలపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. తాజా పరిణామాలను గమనిస్తే.. గ్రూప్-2 పరీక్ష మరోసారి తాత్కాలికంగా వాయిదా పడే అవకాశం ఉంది. అయితే.. ఈ అంశంపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్ష వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు సార్లు గ్రూప్-2 ఎక్సామ్ పోస్ట్పోన్ అయిన విషయం తెలిసిందే. టీఎస్పీఎస్సీ చైర్మన్ సహా పలువురు సభ్యులు రాజీనామా చేయడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిసన్ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. కాగా.. తెలంగాణలో గ్రూప్-2 పరీక్షకు సంబంధించి 783 పోస్టులకు 5 లక్షల 50 వేల మంది అభ్యర్థుల దరఖాస్తు చేసుకున్నారు.