AP Journalist Housing: రేపటి నుంచి జర్నలిస్ట్ హౌసింగ్కు దరఖాస్తుల స్వీకరణ
AP Journalist Housing: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తింపు పొందిన జర్నలిస్టులకు మంజూరు చేసిన సొంతింటి స్థలాలను కేటాయించేందుకు రేపటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
AP Journalist Housing: ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 23 నుండి ప్రారంభిస్తున్న సమాచార శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ ప్రకటించారు.
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 23 నుండి ప్రారంభం కానుందని వివరించారు. రాష్ట్రంలో వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తూ అక్రిడిటేషన్ కలిగిన అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్ ద్వారా ఇంటి స్థలాలను అందించేందుకు ప్రభుత్వం జీవో నెంబర్ 535 జారీ చేసిందని తెలిపారు.
అర్హులైన జర్నలిస్టులు ఇళ్ల స్థలాల మంజూరు కోసం తమ వివరాలను http://ipr.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. నవంబర్ 23వ తేదీ నుండి ఈ వెబ్ సైట్ అందుబాటులో ఉంటుందని, 2024 జనవరి 6వ తేదీలోగా జర్నలిస్టులు సమాచార శాఖ వెబ్సైట్లో జర్నలిస్టులు సంబంధిత వివరాలతో ఆన్లైన్ లో తమ దరఖాస్తును సమర్పించాలని సేచించారు.
అక్రిడిటేటెడ్ జర్నలిస్టులకు కేటాయిస్తున్న ఇళ్ల స్థలం విలువలో 60 శాతం ప్రభుత్వం, 40 శాతం జర్నలిస్టులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత జర్నలిస్ట్ అక్రిడిటేషన్ వివరాలను, జర్నలిస్ట్ గా వారి వృత్తి అనుభవాన్ని ప్రాథమికంగా పరిశీలించి, అర్హులైన జర్నలిస్టుల జాబితాలను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లకు సిఫార్సు చేస్తామని కమిషనర్ తెలిపారు.