కాంగ్రెస్ లో ఫస్ట్ లిస్ట్ రెడీ

 కాంగ్రెస్ లో ఫస్ట్ లిస్ట్ రెడీ

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం కఠినంగా
వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది. పైరవీలకు ఏమాత్రం ఆస్కారం లేకుండా సర్వేల ఆధారంగా ప్రజా బలం
ఉన్న నేతలకే బీఫారాలు ఇవ్వాలని డిసైడ్ అయింది. కర్ణాటకలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని
కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో ఎన్నికల హడావుడి మెుదలైంది. అన్ని పార్టీల నేతలు టికెట్ల కోసం పైరవీలు మెుదలుపెట్టారు.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు తమకు అనుకూలమైన వారికి టికెట్లు ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు
చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు ఢిల్లీకి వెళ్లి అధిష్ఠానాన్ని సైతం కలిశారు. ఈ నేపథ్యంలో టికెట్లు కేటాయించే
అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టమైన విధానాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. పార్టీలో గ్రూపులు నిర్వహించే
నేతలు వారి అనుచరులకు టికెట్లు ఇవ్వాలంటూ పైరవీ చేస్తే వాటిని తిరస్కరించాలని నిర్ణయం తీసుకుంది.
అందులో భాగంగానే అధిష్ఠానానికి విశ్వాసపాత్రుడిగా ఉన్న మురళీధరన్‌ను అభ్యర్థుల ఎంపిక స్క్రీనింగ్‌ కమిటీకి
ఛైర్మన్‌గా నిర్ణయించినట్లు సమాచారం.

ప్రజాబలం ఉన్న నేతలకే బీఫారాలు ఇవ్వాలని.. సీనియర్ నేతలు చెప్పారని టికెట్లు ఇవ్వొద్దని పార్టీ ఎన్నికల
కమిటీకి తేల్చిచెప్పినట్టు తెలిసింది. కర్ణాటకలో ఎదురైన ప్రతికూల ఫలితాల కారణంగానే అధిష్ఠానం ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అక్కడ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రెండు గ్రూపులకు నాయకత్వం వహించిన
ఇద్దరు నేతలు తమ అనుచరులు 13 మందికి టికెట్లు ఇప్పించుకున్నారు. అక్కడి పరిస్థితులకు తలొగ్గిన అధిష్ఠానం
నేతలు చెప్పిన వారికే టికెట్లు కేటాయించింది. అయితే అందులో 12 మంది ఓటమి పాలవ్వగా.. ఒక్కరు మాత్రమే
విజయం సాధించారు. దీంతో అలాంటి తప్పు మరోసారి పునరావృతం కాకుండా కాంగ్రెస్ అధిష్ఠానం కీలక చర్యలు
చేపట్టింది. పైరవీలకు ఆస్కారం లేకుండా ప్రజాబలం ఉన్న నేతలకు టికెట్లు కేటాయించాలని భావిస్తోంది.

తెలంగాణలో ఎన్నికలపై రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి
పట్టు నిలుపుకోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరో ఒకరు చెప్పినట్లుగా బీఫారాల పంపిణీ ఉండదని కాంగ్రెస్‌
అగ్రనేత రాహుల్‌గాంధీ ఇప్పటికే కొందరు నేతలకు చెప్పినట్లు తెలిసింది. టిక్కెట్లు ఆశించే నేతల నుంచి అసెంబ్లీ
సెగ్మెంట్ల వారీగా నుంచి ఈ నెల 18 నుంచి 25 వరకూ దరఖాస్తులు తీసుకోవాలని స్క్రీనింగ్‌ కమిటీ, ఎన్నికల కమిటీలు
నిర్ణయించాయి. 26 నుంచి వచ్చే సెప్టెంబర్ మొదటి వారం వరకూ దరఖాస్తులు ఇచ్చిన వారి బలాబలాలపై గ్రౌండ్‌
లెవల్‌లో సర్వే చేయించి.. ఆ ఫలితాల ఆధారంగా మెరుగైన అభ్యర్థులను గుర్తించేందుకు అధిష్ఠానం కసరత్తు చేస్తుంది.
సెప్టెంబర్ మెుదటి లేదా రెండో వారం కల్లా కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల చేయాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *