రైతుబంధుకు పరిమితి..? కొత్త రేషన్ కార్డుల జారీ.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
కొత్త రేషన్ కార్డులు, రైతుబంధు పరిమితిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆరు గ్యారంటీలకు రేషన్ కార్డు కావాలని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని.. అందుకు సంబంధించిన అఫ్లికేషన్లు కూడా తీసుకుంటామన్నారు. అలాగే రైతుబంధుకు ఎలాంటి
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆ గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తు పత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సెక్రటేరియట్లో విడుదల చేసారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని.. నిస్సాహాయులకు సహాయం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పట్టణాల నుంచి తండాల వరకు అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. రేపటి నుంచి జనవరి 6 వరకు ఆరు గ్యారంటీలకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు.
ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించగా.. ఆయన స్పందించారు. ప్రస్తుతానికి రైతుబంధుకు ఎలాంటి పరిమితి లేదని చెప్పారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అన్ని రాజకీయ పార్టలతో చర్చించిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తామని రేవంత్ అన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర పక్రియ అని..అర్హులందరికీ త్వరలోనే కార్డులు జారీ చేస్తామని చెప్పారు. ప్రత్యేక కౌంటర్ల ద్వారా రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా.. ఫిర్యాదు చేయవచ్చునని చెప్పారు.