మద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్.. రెండో స్థానంలో ఏపీ

 మద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్.. రెండో స్థానంలో ఏపీ

మద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్‌‌లో ఉంది. తెలంగాణలో ప్రతిరోజూ లక్షలాది లీటర్ల మద్యం విక్రయాలు సాగుతున్నాయని ఓ సంస్థ సర్వే వెల్లడైంది. దక్షిణ భారతదేశంలో మద్యం అమ్మకాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది.

పంజాబ్‌లో రూ.1,245, ఛత్తీస్‌గఢ్‌లో రూ.1,227 చొప్పున ఒక్కో వ్యక్తి ఖర్చు చేశారు. పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని ప్రజలు మద్యం కోసం తక్కువ ఖర్చు చేస్తున్నారు

తెలంగాణలో 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి. మరో వెయ్యి వరకు బార్లు, పబ్స్ ఉన్నాయి. ఇటీవల దసరా సందర్భంగా దాదాపు రూ.1,000 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. 11 లక్షల కేసుల మద్యం, 18 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగినట్లు అంచనా.

ఏపీలో 16.9 లక్షల బీర్లు అమ్ముడయ్యాయి. మద్యం వల్ల తెలంగాణలో ఖజానాకు భారీగా ఆదాయం వచ్చిందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ అంచనా వేసింది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *