ప్రభుత్వ ఉద్యోగి అక్రమాస్తుల చిట్టా.. రూ. కోట్లలో ప్రాపర్టీలు, విస్తుపోయే వివరాలు చెప్పిన ఏసీబీ..!

 ప్రభుత్వ ఉద్యోగి అక్రమాస్తుల చిట్టా.. రూ. కోట్లలో ప్రాపర్టీలు, విస్తుపోయే వివరాలు చెప్పిన ఏసీబీ..!

రంగారెడ్డి జిల్లా జాయింట్ రిజిస్ట్రార్ కె. మధుసూదన్ రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. తాము జరిపిన సోదాల్లో రూ. 7.83 కోట్ల విలువైన ఆస్తుల డాక్యుమెంట్లు లభ్యమైనట్లు ఏసీపీ తెలిపింది. ఆయనకు మద్యం వ్యాపారంలో పెట్టుబడులు, షెల్ కంపెనీలు, పలు ప్రాంతాల్లో ఇళ్లు, భూములు, ఫార్మ్ హౌస్, అగ్జరీ వాహనాలు వంటి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు వెల్లడించింది.

హైలైట్:

జాయింట్ రిజిస్ట్రార్ అక్రమాస్తులు
రూ. కోట్లలో ప్రాపర్టీలు
విస్తుపోయే విషయాలు చెప్పిన ఏసీబీ

ACB Booked disproportionate assets Case on Suspended Joint Sub Registrar Madhusudhan Reddy
సస్పెండ్ అయిన రంగారెడ్డి జాయింట్ రిజిస్ట్రార్‌పై ఏసీబీ అక్రమాస్తుల కేసు నమోదు(ఫోటోలు- Samayam Telugu)
అక్రమాస్తులతో కోట్లకు పడగలెత్తిన రంగారెడ్డి జిల్లా జాయింట్ రిజిస్ట్రార్‌గా పని చేసిన కె మధుసూదన్ రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఆన సస్పెన్షన్‍లో ఉన్నారు. కాగా, కె మధుసూదన్ రెడ్డి నివాసంలో చేసిన తనిఖీల వివరాలు ఏసీబీ వెల్లడించింది. తాము చేపట్టిన సోదాల్లో ఇప్పటివరకు రూ. 7.83 కోట్ల విలువైన ఆస్తుల డాక్యుమెంట్లు లభ్యమైనట్లు తెలిపింది. అయితే ప్రస్తుతం మార్కెట్ విలువ.. డాక్యుమెంట్ విలువ కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.

రైల్వేస్టేషన్‌లో యువకుల అనుమానాస్పద కదలికలు.. డౌట్ వచ్చి చెక్ చేస్తే, కట్టలు కట్టలుగా నోట్లు..
కాగా, మధుసూదన్‌ రెడ్డి ఇల్లుతో పాటు బంధువులు, స్నేహితులు, బినామీలకు చెందిన 7 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. మధుసుధన్ రెడ్డి మద్యం వ్యాపారంలో ఏఆర్‍కే స్పిరిట్స్‌లో రూ. 80 లక్షల పెట్టుబడి పెట్టారని తెలిపారు. అంతేకాకుండా అతడి భార్య, పిల్లల పేర్లపై రెండు షెల్ కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.

మధుసూదన్ రెడ్డి అక్రమాస్తుల చిట్టా..
కాప్రా, ఈసీఐఎల్ ప్రాంతాల్లో ట్రిప్లెక్స్ ఇండిపెండెంట్ ఇళ్లు (300 చదరపు గజాలు)
చింతపల గూడ, ఇబ్రహీంపట్నంలో ఖాళీ స్థలం
పరిగి మండలంలోని నాస్కల్ గ్రామంలో 27 ఎకరాల వ్యవసాయ భూమి
ఇబ్రహీంపట్నం మంగళపల్లిలో ఎకరం కమర్షియల్ ల్యాండ్
నాస్కల్‌లో దాదాపు రూ.1.2 కోట్ల విలువ చేసే స్మిమ్మింగ్ పూల్ ఉన్న ఫార్మ్ హౌస్
రూ. 9 లక్షల నగదు
1.2 కిలోల బంగారం
వాహనాలు- ఇన్నోవా ఫార్చునర్, వోల్వో XC60, వోల్క్ స్వాగన్ టైగన్ డీటీ ప్లస్

ఇవేకాకుండా మరికొన్ని ఆస్తులు ఉన్నాయని ఏసీబీ అధికారులు తెలిపారు. వాటి ధ్రువీకరణ జరుగుతోందన్నారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని చెప్పారు. అయితే ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే ఏసీబీ నంబర్ 1064కు కాల్ చేయాలని సూచించారు. లేకుంటే 9440446106 నంబర్‌కు వాట్సప్‌ చేయాలని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు ఏసీబీ అధికారులు.

మరోవైపు, తెలంగాణలో 2025లో అవినీతిపై ఏసీబీ ఉక్కుపాదం మోపింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పాతుకుపోయిన అవినీతిని నిర్మూలించేందుకు ఏసీబీ డీజీ చారుసిన్హా నేతృత్వంలో కఠిన చర్యలు తీసుకున్నరాు. 2023లో 95 కేసులు, 2024లో 152 కేసులు నమోదు కాగా.. 2025లో ఆ సంఖ్య ఏకంగా 199కి చేరాయి. 2025లో ఏసీబీ వలకు 15 మంది భారీ అక్రమార్కులు చిక్కినట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా నీటిపారుదల శాఖలో ఏసీబీ అధికారులు భారీగా సోదాలు జరిపారు. విశ్రాంత ఈఎన్‌సీ మురళీధర్‌రావు, ఈఈ నూనె శ్రీధర్, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీ భూక్యా హరిరాం వంటి కీలక అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో దొరికిపోయిన విషయం తెలిసిందే.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *