న్యూ ఇయర్ వేడుకలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకునేలా హైదరాబాద్ పోలీసులు జాగ్రత్తలు చేపడుతున్నారు. ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా చూసేందుకు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా నగర పోలీసులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. క్యాబ్ సర్వీసులకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. Hyderabad: న్యూ ఇయర్ రోజు ఈ పనిచేస్తే వదిలేదే లేదు.. సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్ New Year Celebrations Venkatrao Lella Venkatrao Lella | Updated on: Dec 31, 2025 | 6:00 AM Share కొత్త సంవత్సరం సెలబ్రేట్ చేసుకునేందుకు హైదరాబాద్ వాసులు సిద్దమవుతున్నారు. డిసెంబర్ 31న అర్థరాత్రి వేడుకలు నిర్వహించుకునేందుకు ఎవరి ప్లాన్లు వాళ్లు వేసుకుంటున్నారు. తమ కుటుంబసభ్యులు లేదా ఫ్రెండ్స్తో జరుపుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక రెస్టారెంట్లు, బార్లు, పబ్లు, క్లబ్లు న్యూ ఇయర్ కోసం కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నారు. డిసెంబర్ 31 వస్తేనే అర్థరాత్రి మందుబాబులు సందడి చేస్తారు. మద్యం తాగుతూ న్యూఇయర్కు వెల్కమ్ చెబుతారు. వైన్ షాపులు కిటకిటలాడనుండగా.. పబ్బులు, బార్లు మందుబాబులతో నిండిపోయి కోలాహలంగా ఉండనున్నాయి. క్యాబ్ రద్దు చేస్తే చర్యలు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు చాలామంది వేరే ప్రాంతాలకు వెళ్తుంటారు. సొంత వెహికల్ లేనివారు లేదా మద్యం తాగినవారు క్యాబ్ లేదా ఆటోలను ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. క్యాబ్ లేదా ఆటో డ్రైవర్లు రైడ్ రావడానికి నిరాకరించినా, బుకింగ్ ధర కంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినా ఉపేక్షించేది లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించే వారిపై మోటార్ వెహికల్ చట్టం సెక్షన్ 178(3)(b) ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే తమకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వాట్సప్ నెంబర్ వాహనం నంబర్, సమయం/ప్రదేశం, రైడ్ వివరాల స్క్రీన్షాట్ను హైదరాబాద్ పోలీస్ అధికారిక వాట్సాప్ నంబర్ 9490616555 కు పంపించాలని సూచించారు. వెంటనే పోలీస్ సిబ్బంది స్పందించి నిబంధనలు పాటించనివారిపై కేసులు నమోదు చేశారని సూచించారు. కాగా డిసెంబర్ 31న రద్దీ కారణంగా ఆన్లైన్ క్యాబ్ సర్వీస్ ఫ్లాట్ఫామ్స్ భారీగా ధరలను పెంచనున్నాయి. అలాగే రైడ్ల క్యాన్సిలేషన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సమయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు హైదరాబాద్ పోలీసులు ఈ కొత్త గైడ్ లైన్స్ జారీ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సంక్రాంతికి బంపర్ ఆఫర్ ఇస్తోంది. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలకు, పండగ తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలకు టోల్ చార్జెస్ మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం, NHAIను కోరింది తెలంగాణ ప్రభుత్వం.
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సంక్రాంతికి బంపర్ ఆఫర్ ఇస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రా వైపు వెళ్లే ప్రయాణికులకు ఊరటనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. పండుగ సమయంలో అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై మూడు, నాలుగు రోజుల పాటు టోల్ వసూళ్లను నిలిపివేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆలోచన చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలకు జనవరి 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అలాగే విజయవాడ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చే వాహనాలకు జనవరి 16వ తేదీ నుంచి జనవరి 18వ తేదీల్లో టోల్ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి, NHAIకు లేఖ రాశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి..
ప్రతి ఏటా సంక్రాంతికి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరుతుంటాయి. ఫాస్టాగ్ ఉన్నప్పటికీ లక్షల సంఖ్యలో వాహనాలు రావడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ప్రస్తుతం ఈ హైవేపై ఫ్లైఓవర్లు, అండర్పాస్లు, విస్తరణ పనులు జరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశముంది. టోల్ వసూళ్ల కోసం వాహనాలను ఆపితే హైవే మొత్తం స్తంభించిపోయే ప్రమాదం ఉండటంతో సంక్రాంతి టోల్ ఫ్రీ ప్రయాణానికి అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సమాచారం.
అయితే.. తెలంగాణ ప్రభుత్వం టోల్ చార్జెస్ మినహాయించాలని కోరడంపై.. కేంద్ర ప్రభుత్వం, NHAI ఏ విధంగా స్పందిస్తాయనేది చర్చనీయాంశంగా మారింది.