నేడే క్రిస్మస్ పండుగ.. అసలు ఎందుకు జరుపుకుంటారంటే?

నేడే క్రిస్మస్ పండుగ.. జీసస్ జన్మదిన సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్లు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే ఈ పండుగను జరుపుకోవడం వల్ల ఆ యేసుక్రీస్తు దీవెనలు ఎప్పుడు ఉంటాయని క్రిస్టియన్లు విశ్వసిస్తారు.
అందరూ ఎదురుచూసే క్రిస్మస్ పండుగ రానే వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్లు ఈ క్రిస్మస్ పండుగను డిసెంబర్ 25న ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున క్రిస్టియన్లు చర్చికి వెళ్లి యేసు క్రీస్తును ప్రార్థిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చర్చిలు నేడు లైట్లతో కలకలలాడుతుంటాయి. నేడు యేసుక్రీస్తు జన్మించారని అందుకే ఈ క్రిస్మస్ను జరుపుకుంటారని చెప్పుకుంటారు. అయితే ఈ రోజు యేసుక్రీస్తు జన్మించిన రోజు కాదట. అసలు యేసుక్రీస్తు నేడు జన్మించినట్లు ఎక్కడా కూడా బైబిల్లో లేదట
రోమన్లు మొదటిగా సూర్యభగవానుని..
నిజం చెప్పాలంటే జీసస్ ఎప్పుడు జన్మించారనే విషయం ఎవరికీ తెలియదు. ఈ క్రిస్మస్ పండుగను మొదటిగా రోమన్లు జరుపుకునేవారట. సూర్య భగవానుడిని ప్రధాన దేవతగా భావించి రోమన్లు డిసెంబర్ 25న ఆయన పుట్టిన రోజు నిర్వహించేవారు. ఆ తర్వాత క్రీ.పూ 1855లో యేసుక్రీస్తే సూర్యభగవానుడిగా అవతరించాడని కొందరు నమ్మారు. ఇక అప్పటి నుంచి డిసెంబర్ 25న క్రిస్టియన్లు క్రిస్మస్ను జరుపుకుంటున్నారు. సూర్య భగవానుడి జన్మదినం కాస్త.. యేసుక్రీస్తు జన్మదినంగా మారిందని చెబుతుంటారు.
క్రిస్మస్ పండుగను జరుపుకోవడం వల్ల ఆ యేసుక్రీస్తు దీవెనలు ఎప్పుడు ఉంటాయని క్రిస్టియన్లు నమ్ముతారు. ఈ రోజున ఇంటిని లైట్లు, స్టార్లు, క్రిస్మస్ ట్రీలతో అలంకరిస్తారు. అలాగే క్రిస్టియన్లు చర్చిలకు వెళ్లి ప్రార్థనలు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కోరిన కోరికలు జీసస్ నెరవేరుస్తారని నమ్ముతారు. వీటితో పాటలు, ఆటలతో నేడు ఈ పండుగను ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు.