నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్‌లో వెళ్లకండి

 నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్‌లో వెళ్లకండి

నేడు డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి నూతన విగ్రహన్ని సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 6 గంటలకు ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. సోమవారం సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకు అటుగా వెళ్లే వాహనాలను మల్లించనున్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వం విజయోత్సవాలను నిర్వహిస్తుంది. అందులో భాగంగా నేడు డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి నూతన విగ్రహన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 6 గంటలకు సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహన్ని ఆవిష్కరించనున్నారు. తెలంగాణ విగ్రహం ప్రారంభించాక డ్రోన్ షో నిర్వహించి, ఫైర్ క్రాకర్స్ కాల్చనున్నారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ట్రాఫిక్ పోలీసులు ట్యాంక్ బండ్ సెక్రటేరియట్ మీదుగా వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తారు.

ఖైరతాబాద్ రైల్వే బ్రిడ్జ్, నక్లైస్ రోడ్, నారాయణ గూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, ట్యాంక్ బండ్ రోడ్డుపై వచ్చే వెహికల్స్ ను వేరే మార్గాల ద్వారా తరలిస్తారు. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్ బండ్ పరిసరాల్లోకి వాహనాలతో వెళ్లకపోవడం మంచిది. విజయోత్సవాల వేడుకలను చూడాలనుకునే వారు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌కు చేరుకొని అక్కడి నుంచి కాలినడకన పీవీఆర్ ఐమ్యాక్స్ రూట్‌లో సచివాలయానికి చేరుకోవడం సులభం.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *