కేసీఆర్ కు కొత్త మిత్రులు లెవరో….?

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మర్చి దేశ రాజకీయాలలో కీలక నాయకుడుగా చెలామణి ఐ పోవాలని తెలంగాణ
ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద కలలే కన్నారు. పంజాబ్, ఢిల్లీ, జార్ఖండ్ ,బెంగాల్ ,కర్ణాటక ,మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్
ఇలా ఒకటేమిటి ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న చోట బలంగా ఉన్న చోటల్లా పర్యటించి వచ్చారు .
బీజేపీకి కాంగ్రెస్ కు సమన దూరం పాటిస్తున్నాము అంటూ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ పెద్ద హడావుడే చేసారు .
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కనీసం 150 స్థానాలకైనా పోటీ చేయాలని మొదట్లో పెద్ద లక్ష్యమే పెట్టుకున్నారు .
తీరా ఎక్కడ గొంగళి అక్కడే వేసినట్టు అంట గాప్చుప్ సాంబారి బుడ్డిలా ఐ పోయింది . కేసీఆర్ కు జాతీయ స్థాయి
నాయకుడంత సీన్ లేదని భావించిన ఆయా పార్టీలు లైట్ తీసుకున్నారు . చివరికి దేశం లో రెండు పెద్ద పార్టీలు
బీజేపీ కాంగ్రెస్ ఇటీవల తమ మిత్ర పక్షాలతో నిర్వహించిన సమావేశాలకు కేసీఆర్ కు అసలు ఆహ్వానమే దక్కలేదు .
ఐతే మహారాష్ట్ర మీద మాత్రం కేసీఆర్ కు పెద్ద అసలే ఉన్నట్టున్నాయి . ఏమాత్రం ఖాళీ దొరికిన కేసీఆర్
మహారాష్ట్రలో వాలిపోతున్నారు . మంది మార్బలంతో భారీ వాహన శ్రేణితో ఆ రాష్ట్రం లో హడావుడి చేస్తున్నారు .
ఇప్పటికే పలుచోట్లా సభలు కూడా నిర్వహించారు . ఐతే ఇప్పటివరకు క్రింది స్థాయి చోట మోట నేతలే తప్పా
పెద్దగా పేరున్న నేతలు కేసీఆర్ పార్టీలో చేరలేదు . ప్రస్తుతం తెలంగాణ ను వానలు వరదలు
ముంచెత్తుతున్నాయి . బాధితులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు . ఐతే కేసీఆర్ మాత్రం మరో సారి
మహా రాస్తాలో వాలి పోయారు . తాము ఎన్డీయే తో లేము ఇండియా కూటమితో కూడా లేమని కేసీఆర్
వ్యాఖ్యానించారు . తాము తమ మిత్రులతో ఉన్నామని ఆయన వ్యాఖ్యానించడం విశేషం . దేశంలో
బీఆర్ఎస్ తో కలిపి తో కలిపి కేవలం 11 పార్టీలే . ప్రస్తుతం ఏ పార్టీ లో ను లేకుండా విడిగా ఉన్నాయ్ .
వీటిలో ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ విజు జనతాదళ్ బీఆర్ఎస్ జనతాదళ్ సెక్యూరల్ మాత్రమే . మిగతావన్నీ
చిన్న పార్టీ లు ఈ పార్టీ లన్ని కేసీఆర్ కు మిత్రులుగా లేవు . మరి కేసీఆర్ అంటున్న మిత్రులు ఎవరని ప్రస్తుతం
చర్చ జరుగుతుంది . మహారాష్ట్ర లో కాంగ్రెస్ బీజేపీ దేశాన్ని నాశనం చేశాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు .
ఐతే తాము తమ మిత్రులతో కలిసి ఉన్నామని అన్నారు .
కానీ కేసీఆర్ వెంట ఒక్కరంటే ఒక్క మిత్రుడు కనిపించడం లేదు . కర్ణాటకలో కుమారస్వామి… తమిళనాడు లో
BCK పార్టీ కూడా కేసీఆర్ కు దూరమయ్యాయి . కుమారస్వామి బీజేపీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారు .
కేసీఆర్ ఫెడరల్ ప్రెంట్ తో ముందుకు వెళ్లడంతో అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఆయనను నమ్మడం మానేశాయని టాక్ .
బీజేపీ కి లాభం చేకూర్చడానికే కాంగ్రెస్ లేకుండా ఫెడరల్ ఫ్రంట్ ను కేసీఆర్ ముందుకు తెచ్చారని కాంగ్రెస్ పార్టీ
భావించింది అని అంటున్నారు .
అలాగే తమ ఓటు బ్యాంకును దెబ్బతీయడానికే కేసీఆర్ కాంగ్రెస్ కు లబ్ధిచేకూరుస్తున్నారని బీజేపీ భావించిందని
అంటున్నారు . దీనితో రెండింటికి చెడ్డా రేవడిలా కేసీఆర్ పరిస్థితి తయారైందని చెపుతున్నారు . అందుకే దేశం లో
11 పార్టీలు మినహాయింపు ఉన్న పార్టీ లు అన్ని కాంగ్రెస్ నేతృత్వం లోని ఇండియా కూటమిలో బీజేపీ
నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరిపోయాయని పేర్కొంటున్నారు .మరి కేసీఆర్ చెపుతున్న కొత్త మిత్రులు
ఎవ్వరో ఆయనే చెప్పాల్సి ఉంటుంది .