ఏపీలో ఫ్రీబస్ స్కీమ్ అమలు డేట్ ఇదే.. మహిళలకు మంత్రి శుభవార్త

 ఏపీలో ఫ్రీబస్ స్కీమ్ అమలు డేట్ ఇదే.. మహిళలకు మంత్రి శుభవార్త

ఏపీలో మహిళలకు ఫ్రీబస్ స్కీమ్ పై మంత్రి రవాణ శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మరో రెండు నెలల్లో ఈ స్కీమ్ అమల్లోకి రానుందని చెప్పారు

ఏపీలో మహిళలకు ఫ్రీబస్ స్కీమ్ పై మంత్రి రవాణ శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మరో రెండు నెలల్లో ఈ స్కీమ్ అమల్లోకి రానుందని చెప్పారు. తిరుపతి జిల్లాలోని నాయుడుపేటలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ రోజు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతి జిల్లాలోని శ్రీసిటీని అభివృద్ధి చేస్తామన్నారు. తద్వారా నిరుద్యోగ యువతకు భారీ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో రాష్ట్ర అభివృద్ధి దిశగా అనేక మార్పులు తెచ్చామన్నారు. మహిళలకు 3 ఫ్రీ సిలిండర్లు ఇస్తున్నామన్నారు. మొత్తం 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే మరో 2 నెలల్లో ఫ్రీబస్ స్కీమ్ ను సైతం ప్రారంభించనున్నట్లు చెప్పారు మంత్రి.

 

రేపటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం..

రేపు అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కూటమి ప్రధాన ఎన్నికల హామీ అయిన సుపర్ సిక్స్ పై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఫ్రీబస్ స్కీమ్ అమలుకు సంబంధించి సైతం ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం సాగుతోంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *