CM Jagan : ఇక్కడున్నది అభిమన్యుడు కాదు అర్జునుడు, ప్రతిపక్షాల పద్మవ్యూహాన్ని ఛేదిస్తాం- సీఎం జగన్

 CM Jagan : ఇక్కడున్నది అభిమన్యుడు కాదు అర్జునుడు, ప్రతిపక్షాల పద్మవ్యూహాన్ని ఛేదిస్తాం- సీఎం జగన్

CM Jagan : ప్రతిపక్షాల పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడి ఉన్నది అభిమన్యుడు కాదు అర్జునుడు అని సీఎం జగన్ అన్నారు. భీమిలి నియోజకవర్గం సంగివలసలో సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించారు.

సీఎం జగన్

CM Jagan : రాష్ట్రంలో మరో 75 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగబోతోందని సీఎం జగన్ అన్నారు. ఈ ఎన్నికల్లో అబద్దానికి, నిజానికి మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. ఇంటింటికీ వెళ్లి వైసీపీ పాలనలో జరిగిన మంచిని వివరించాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం సంగివలసలో సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… గతంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చెత్తబుట్టలో పడేసిన పరిస్థితి ఉందని, మీ బిడ్డ అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో ఇచ్చిన 99శాతం హామీలను నెరవేర్చాడన్నారు. వచ్చే ఎన్నికలకు ప్రతిపక్షాలు పద్మవ్యూహం పన్నుతున్నాయన్న జగన్… ఈ పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ ఉంది అభిమన్యుడు కాదు…. అర్జునుడు అన్నారు. ఈ అర్జునుడికి కృష్ణుడి లాంటి ప్రజలు తోడున్నారన్నారు. వచ్చే ఎన్నికలు కౌరవులు, పాండవుల మధ్య యుద్ధం లాంటిదన్నారు. ఈ యుద్ధంలో వైసీపీ 175 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

వచ్చే యుద్ధంలో చంద్రబాబు సహా ప్రతిపక్షాలన్నీ ఓడాలని సీఎం జగన్ అన్నారు. ఏపీలో మరో 25 ఏళ్ల పాటు వైసీపీ జైత్ర యాత్రకు కొనసాగిస్తామన్నారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక దత్త పుత్రుడిని వెంట వేసుకుని తిరుగుతున్నారన్నారు. ఈసారి టీడీపీకి గత ఎన్నికల్లో వచ్చిన 23 స్థానాలు కూడా రావన్నారు. టీడీపీకి 175 స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేరని ఎద్దేవా చేశారు. 14 ఏళ్ల టీడీపీ పాలనలో మంచి చేయాలనే ఆలోచన రాలేదన్నారు. చంద్రబాబు పెత్తందార్లకు మాత్రమే సీఎంగా ఉన్నారన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, సున్నా వడ్డీ, ఎరువులు సకాలంలో అందుతున్నాయంటే జగనే గుర్తువస్తారన్నారు.

ఎక్కడ చూసినా జగన్ మార్క్ పాలనే

56 నెలల కాలంలోనే సంక్షేమం, అభివృద్ధి అంటే చేసి చూపించామని సీఎం జగన్ అన్నారు. లంచాలు, వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా పారదర్శకంగా పాలన చేశామన్నారు. ప్రతి నెలా 1న ఇంటింటికి పింఛన్లు ఇస్తున్నామన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సకాలంలో ఎరువులు అందిస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ విధానాలు అమలుచేస్తున్నామన్నారు. నాడు-నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చామన్నారు. దిశ యాప్‌ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ప్రతి గ్రామానికి డిజిటల్‌ లైబ్రరీలు, బ్రాడ్‌బ్యాండ్‌లు తీసుకొచ్చామన్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *