BIG BREAKING: టీడీపీ నుంచి కొలికపూడి ఔట్?
జనవరి 11న ఓ ఎస్టీ మహిళపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ కు క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది.
తాను ఎలాంటి తప్పు చేయలేదని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ స్పష్టం చేశారు. RTVకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ రోజు టీడీపీ క్రమశిక్షణ కమిటీ విచారణకు ఆయన హాజరయ్యారు. కమిటీ సభ్యులకు అన్ని విషయాలు చెప్పానన్నారు.