నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

 నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేడు సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ రోజు సాయంత్రం 6:05 గంటలకు దాదాపు లక్ష మంది మహిళల సమక్షంలో విగ్రహావిష్కరణ చేయనున్నారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.

కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర సచివాలయంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఏర్పాట్లు కూడా ఘనంగా చేశారు. ఈ రోజు సాయంత్రం 6:05 గంటలకు దాదాపు లక్ష మంది మహిళల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి విగ్రహావిష్కరణ చేస్తారు. ఆ తర్వాత ఒకవైపు సీఎం ప్రసంగిస్తుండగా మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. అలాగే ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ గంగాధర్, రమణారెడ్డిలను సన్మానిస్తారు. రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రచించిన కవి అందెశ్రీని, విగ్రహ రూపకర్తలు అయిన ప్రొఫెసర్ గంగాధర్, రమణారెడ్డిలను ప్రభుత్వం సన్మానిస్తారు. విగ్రహావిష్కరణ తర్వాత ఎన్టీఆర్ మార్గ్ దగ్గర డ్రోన్ షో నిర్వహిస్తారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *