మహాకుంభమేళా కోసం 13 వేల రైళ్లు.. అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన

 మహాకుంభమేళా కోసం 13 వేల రైళ్లు.. అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన

వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న కుంభమేళాకు తరలివచ్చే యాత్రికుల కోసం ఏర్పాట్లు చేసేందుకు రైల్వేశాఖ రెడీ అవుతోంది. ఇందుకోసం 3 వేల ప్రత్యేక రైళ్లతో కలిపి మొత్తంగా 13 వేల రైళ్లను నడపనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వెష్ణవ్ తెలిపారు.

వచ్చే ఏడాది జనవరిలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం అధికారులు భారీ ఏర్పా్ట్లు చేస్తున్నారు. ఈ వేడుకలు వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కుంభమేళాకు తరలివచ్చే యాత్రికుల కోసం అన్ని ఏర్పాట్లు చేసేందుకు రైల్వేశాఖ రెడీ అవుతోంది. ఇందుకోసం 3 వేల ప్రత్యేక రైళ్లతో కలిపి మొత్తంగా 13 వేల రైళ్లను నడపనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వెష్ణవ్ తెలిపారు.

వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా జరగనుంది. అయితే ఈ వేడుకకు దాదాపు 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మంది రైళ్ల ద్వారా అక్కడికి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కుంభమేళా కోసం రైల్వేశాఖ చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించేందుకు అశ్వినీ వైష్ణవ్‌ ఆదివారం వారణాసి నుంచి రైలు మార్గంలో ప్రయాగ్‌రాజ్‌కు ప్రయాణించారు. ఈ క్రమంలోనే మార్గమధ్యంలో ఇటీవల గంగానదిపై నిర్మించిన కొత్త బ్రిడ్జిని కూడా పరిశీలించారు.

ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే ఈ కొత్త వంతెనను ప్రారంభించనున్నట్లు తెలిపారు. దాదాపు 100 ఏళ్ల తర్వాత ఈ గంగానదిపై తమ ప్రభుత్వం కొత్త బ్రిడ్జిని నిర్మించిందని అశ్విమీ వైష్ణవ్ అన్నారు. ఇక కుంభమేళా కార్యక్రమం ఏర్పాట్ల కోసం భారతీయ రైల్వే గత రెండేళ్లలో ఏకంగా రూ.5 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *