పండ్లు, కూరగాయల్ని క్లీన్ చేయడానికి వెనిగర్, బేకింగ్ సోడా సొల్యూషన్ని షేర్ చేసిన డాక్టర్ టిమ్, సైన్స్ ఏం చెబుతోందంటే
పండ్లు, కూరగాయల్ని క్లీన్ చేయడానికి వెనిగర్, బేకింగ్ సోడా సొల్యూషన్ని షేర్ చేసిన డాక్టర్ టిమ్, సైన్స్ ఏం చెబుతోందంటే
పండ్లు, కూరగాయల్ని కడగడం చాలా ఈజీ అనిపించొచ్చు. కానీ, పురుగుమందులు, బ్యాక్టీరియా, బయట కాలుష్య కారకాల గురించిన ప్రశ్నలు చాలా మందిని వేధిస్తున్నాయి. దీంతో సరిగ్గా క్లీన్ చేసే పద్ధతుల గురించి వెతుకుతున్నారు. అలాంటి చిట్కాలకోసం ఇంటర్నెట్లో వెతుకుతుంటారు. అయితే ఏవైనా ఫాలో అయ్యే ముందు అన్నీ విషయాల గురించి తెలుసుకుని ఆచరించడం మంచిది.
కూరగాయలు, పండ్లు క్లీన్ చేయడం గురించి మెమోరియల్ స్లోన్ కెట్టరింగ్ కాన్సర్ సెంటర్లో సర్టిఫైడ్ ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ టిమ్ టియుటిన్ చెబుతున్నారు. మనం కొనే కూరగాయల్ని, పండ్లని రన్నింగ్ వాటర్ కింద పెట్టి క్లీన్ చేస్తే సరిపోతుందని అనుకుంటాం. అయితే, బెర్రీస్ వంటి పండ్లకి సరైన విధానంలోనే క్లీన్ చేయాలని డాక్టర్ టిమ్ టియుటిన్ షేర్ చేసుకున్నారు.
మనం కూరగాయల్ని, పండ్లు కొనుక్కొచ్చినప్పుడు సాధారణంగా నీటితో కడుగుతాం. కానీ, ఇలా చేయడం వల్ల పూర్తిగా క్లీన్ అవ్వవు. నీటితో కడగడం వల్ల పైన ఉండే సూక్ష్మజీవులు మాత్రమే తొలగిపోతాయి. కానీ, కొన్ని రకాల పండ్లు ముఖ్యంగా ఆపిల్స్ వంటివాటిలో పురుగు మందు అవశేషాల్ని బంధించే మైనపు పూతలు అలానే ఉంటాయి. కొన్ని పురుగుముందులు ఉపరితలం క్రింద కొద్దిగా చొచ్చుకుపోతాయి. ఆకుకూరల్లో అయితే వాటి ముడతలో మట్టి, సూక్ష్మజీవులు ఉంటాయి. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(FDA) ప్రకారం, రన్నింగ్ వాటర్ కింద కూరగాయలు, పండ్లని క్లీన్ చేయడం మంచిది. కానీ, కొన్ని సార్లు మరికొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. వాటి గురించి తెలుసుకుందాం.
డాక్టర్ ప్రకారం ఎలా క్లీన్ చేయాలి?
ముందుగా కూరగాయలు, పండ్లని రన్నింగ్ వాటర్ కింద కడగాలి.
అదే విధంగా, ఫిల్టర్ చేసిన నీటితో కలిపిన వెనిగర్లో కనీసం 10 నిమిషాలు ఉంచాలి.
తర్వాత బేకింగ్ సోడాని కాసేపు ఉంచి తర్వాత క్లీన్ చేయాలి. ఇలా చేశాక ఫ్రీజ్ చేసే ముందు ఆరబెట్టి ఫ్రిజ్లో పెట్టాలి.
వెనిగర్లోని ఆమ్లత్వం సూక్ష్మజీవుల్ని, కొన్ని పురుగుమందు అవశేషాల్ని తగ్గించడంలో సాయపడుతుంది. బేకింగ్ సోడా ఉపరితల మురికిని వదిలించడంలో సాయపడుతుంది.
అయితే, సైన్స్ ఏం చెబుతుందంటే
బేకింగ్ సోడా సొల్యూషన్తో రిజల్ట్
ఈ అంశంపై 2017లో అమెరికన్ కెమికల్ సొసైటీ జర్నల్ ACSఒమేగాలో శాస్త్రీయ అధ్యయనం ప్రచురితమైంది. బేకింగ్ సోడా అంటే సోడియం బైకార్బోనేట్ సొల్యూషన్లో ఆపిల్స్ని 12 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టడం వల్ల నీటితో కడగం, బ్లీచ్ సొల్యూషన్ కంటే ఎక్కువగా పురుగు మందు అవశేషాలు తొలగిపోయాయి.
అందులో థియాబెండజోల్, ఫాస్మెట్ వంటివి కూడా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే పరిశోధన ప్రకారం బేకింగ్సోడా ఆల్కలీన్. ఇది పండ్ల ఉపరితలంపై కొన్ని పురుగుమందుల అణువుల్ని విచ్ఛిన్నం చేయడంలో హెల్ప్ చేస్తుంది.
ఎలా వాడితే రిజల్ట్
2 కప్పుల నీటిలో 1 టీస్పూన్ బేకింగ్ సోడాని కలపండి.
ఆపిల్స్, ద్రాక్ష, బెర్రీస్ వంటి గట్టిగా ఉండే పండ్లని 12 నుంచి 15 నిమిషాలు ఉంచండి.
తర్వాత రన్నింగ్ వాటర్ కింద ఉంచి క్లీన్ చేయండి.
తర్వాత శుభ్రమైన నీటితో తుడిచి ఆరబెట్టండి.
వెనిగర్ వాష్ ఎలా ఉపయోగపడుతుంది
ఈ టిప్ కూడా బాగా పనిచేస్తుంది. వెనిగర్ అనేది అసిటిక్ యాసిడ్గా పనిచేస్తుంది. నీటిలో కలిపిన వెనిగర్ ఈ కోలీ సహా కొన్ని బ్యాక్టీరియాల్ని తగ్గిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కానీ, అది అన్ని పురుగు మందు అవశేషాల్ని పూర్తిగా తొలగిస్తుందని నిరూపణ కాలేదు. అసిడిక్ గుణం పైన ఉండే వ్యాక్స్ లేయర్ని వదిలిస్తుంది. అలానే పైన ఉండే సూక్ష్మజీవుల్ని తగ్గిస్తుంది.
ఎలా వాడాలి?
1 భాగం వైట్వెనిగర్లో 3 భాగాల నీటిని కలపండి.
అందులో కూరగాయలు, పండ్లని నానబెట్టండి.
రుచి, వాసనల్ని తొలగించడానికి బాగా కడగాలి.
ఆకుకూరల పరిస్థితేంటి?
ఆకుకూరల పరిస్థితేంటి?
మన కిచెన్లో ఎక్కువగా పాలకూర, కొత్తిమీర వంటి ఆకుకూరల్ని వాడతాం. వీటిని క్లీన్ చేయడానికి మరో పద్ధతి ఉంది.
ఎలా వాడాలి?
ఆకుల్ని విడివిడిగా చేయాలి.
రన్నింగ్ వాటర్ కింద క్లీన్ చేయండి.
మంచి నీటిలో మరో 2, 3 నిమిషాల పాటు నానబెట్టండి.
తర్వాత క్లీన్ చేయండి.
ఇప్పుడు నీటిని డ్రెయిన్ చేయండి.
వీటిని క్లీన్ చేసేందుకు సబ్బు, డిటర్జెంట్ని వాడొద్దొని ఫుడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఎందుకంటే, వాటి అవశేషాలు మరింత హాని చేయొచ్చు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(CDC)ప్రకారం, ఆకుకూరల్లో సూక్ష్మజీవులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి, మనం వాటిని మనం కట్ చేసేందు ఎప్పుడు కూడా బాగా కడగాలి.
రూట్ వెజిటేబుల్స్ పరిస్థితేంటి?
మనం దుంపలు అంటే బంగాళాదుంపలు, క్యారెట్స్, ముల్లంగి వంటి దుంపల్లో నేల ఆధారిత బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎలా క్లీన్ చేయాలంటే.
రన్నింగ్ వాటర్ కింద ముందుగా క్లీన్ చేసుకోండి. ముందుగా శుభ్రమైన కూరగాయల బ్రష్ని వాడండి. అవసరమనుకుంటే పీల్ చేయండి. నేలలో పండే పంటల్ని నానబెట్టడం కంటే స్క్రబ్బింగ్ చేయడం మంచిది. ఇండియాలో వాడే పురుగుమందు రకాల్ని US ఆధారిత
అధ్యయనాల్లో పరీక్షించినప్పుడు కాస్తా రిజల్ట్స్ వేరుగా ఉండొచ్చు. ఫుడ్ సేఫ్టి అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI)సలహా ఇస్తుంది. వీటిని ముందుగా మంచినీటితో బాగా కడగాలి.
కెమికల్ డిట్జెంట్స్ వద్దు.
మీకు వీలుంటే తొక్కతీయండి.
మీకు నమ్మమైన వారి దగ్గరే వీటిని తీసుకోవడం మంచిది.
ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలి?
ఇండియాలో ఆకుకూరలు, బెర్రీస్ వంటి వాటిలో ఎక్కువగా పురుగు మందులు వేసి పండిస్తారు. కాబట్టి, వాటిని నానబెట్టి, క్లీన్ చేయడం వంటిది.
చేయకూడని తప్పులు
సబ్బు, డిటర్జెంట్స్ వాడొద్దు
క్లాత్తో తుడవడం మాత్రమే కాదు చక్కగా క్లీన్ చేయాలి.
వెనిగర్, బేకింగ్ సోడాలో నానబెట్టిన తర్వాత కచ్చితంగా క్లీన్ చేయాలి.
ఎక్కువగా కెమికల్స్ని కలపొద్దు.
ఏయే కూరగాయల్ని ఎలా క్లీన్ చేయాలి?
కూరగాయలు లేదా పండ్లు
ఎలా క్లీన్ చేయాలి?
ఎలా పనిచేస్తుంది
ఆపిల్స్, పియర్స్
బేకింగ్ సోడా నీటిలో 12 నుంచి 15 నిమిషాలు నానబెట్టడం
పురుగు మందు అవశేషాల్ని తొలగిస్తుంది.
ద్రాక్షపండ్లు
బేకింగ్ సోడాలో నానబెట్టి +కడగడం
పైన ఉండే పురుగుమందుల్ని తొలగిస్తుంది.
పాలకూర, కొత్తిమీర
మరోసారి కడిగి+ నానబెట్టడం
మట్టి, సూక్ష్మజీవుల్ని తొలగిస్తుంది.
బంగాళాదుంపలు, క్యారెట్స్
నీటి కింద స్క్రబ్ చేయడం
మట్టితో వచ్చే బ్యాక్టీరియాని తొలగిస్తుంది.
టమాటలు
కడిగి+ కొద్దిగా రబ్ చేయడం
దుమ్ము, ఉపరితల సూక్ష్మజీవుల్ని తొలగిస్తుంది.
మొత్తంగా
కూరగాయలు, పండ్లని నార్మల్ నీటితో కడగడం మంచిదే. కానీ, కొన్ని పండ్లు, కూరగాయలు అంటే మైనపు పూతలు, ఎక్కువగా పురుగు మందు చల్లిన పండ్లు, కూరగాయలకి బేకింగ్ సోడా, వైట్ వెనిగర్ సోకింగ్, క్లీనింగ్ మంచిది. అయితే, ఈ ఇంటి చిట్కాలు పూర్తిగా పురుగుమందు అవశేషాల్ని తొలగించదు.
మీరు నమ్మకం ఉన్న చోట కొనడం, అవసరమైనప్పుడు వాటిని పీల్ చేసి వాడడం, సరైన విధంగా నిల్వ చేయడం వంటివి చాలా ముఖ్యం.
కాబట్టి, మనం ఏవైనా ఇలాంటి సోషల్ మీడియాలో హ్యాక్స్ చూసి వాటినే ఫాలో అవ్వడం కాకుండా, శాస్త్రీయ అధ్యయనాలు, ఫుడ్ సేఫ్టీ
మార్గదర్శకాలని కనుక్కోవాలి. అవసరమైతే ఎక్స్పర్ట్స్ సలహా తీసుకోవాలి.
ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి. తెలుగు సమయం ఈ విషయాల్ని ధృవీకరించడం లేదు. ఖచ్చితత్వం, ప్రభావానికి తెలుగు సమయం బాధ్యత వహించదు.