తెలంగాణకు నేనే రాజు నేనే మంత్రి.. నాకు పోటీ ఎవరూ లేరు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

 తెలంగాణకు నేనే రాజు నేనే మంత్రి.. నాకు పోటీ ఎవరూ లేరు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు నేనే రాజు నేనే మంత్రి అంటూ వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు చేరుకుందని తెలిపారు. ఇక కేసీఆర్‌పై తనకు కక్ష సాధింపు లేదని.. కేసీఆర్‌ను జైలుకు పంపించాలంటే రూల్స్ ప్రకారమే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. పదిన్నరేళ్లపాటు తానే తెలంగాణకు సీఎంను అని పేర్కొన్నారు. కాళేశ్వరం, ఫార్ములా ఈ- కార్ రేసు కేసుల్లో కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

తెలంగాణకు నేనే రాజు నేనే మంత్రి.. నాకు పోటీ ఎవరూ లేరు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ టూర్‌లో మీడియాతో చిట్ చాట్‌ మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. తనకు ఎవరూ పోటీ కాదని తేల్చి చెప్పారు. తెలంగాణకు పదిన్నర ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి.. తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి అని వెల్లడించారు. దేశంలో 2029లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని మరోసారి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అదే సమయంలో కేసీఆర్ కుటుంబంపై స్పందించిన ముఖ్యమంత్రి.. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు.. చివరి దశకు చేరినట్లు పేర్కొన్నారు. దర్యాప్తు ఆధారంగానే ఏ కేసులోనైనా ముందుకెళ్తామని స్పష్టం చేశారు.

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తమకు ఎలాంటి కక్ష సాధింపు లేదని తేల్చి చెప్పిన రేవంత్ రెడ్డి.. ఒకవేళ కేసీఆర్‌ను జైలులో వేయాలని అనుకుంటే నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం.. బీఆర్ఎస్‌పై తీవ్ర ఆరోపణలు చేసినట్లు గుర్తు చేసిన రేవంత్ రెడ్డి.. కాళేశ్వరం అవినీతి కేసుతోపాటు.. ఫార్ములా ఈ-కార్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారణ చేసిన ఈడీ అధికారులు.. కేసీఆర్, కేటీఆర్‌లను ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు.

కేసీఆర్, హరీశ్ రావు కోరినట్లుగా ప్రభుత్వం నడువదని రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం అక్రమాలు, ఫార్ములా ఈ-రేసుపై కేంద్ర ప్రభుత్వం చర్యలు ఎక్కడా అని ప్రశ్నించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించిన ఈడీ, కేటీఆర్‌ను ఎందుకు విచారించడం లేదో చెప్పాలన్నారు. త్వరలోనే అన్ని డాక్యుమెంట్లను సభలో పెడతానని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాం నుంచే సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉందని తెలిపారు. పదేళ్ల పాటు కేసీఆర్‌ను ఆ విషయం గురించి అడగకుండా కిషన్ రెడ్డి తనను అడుగుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

కేసీఆర్, హరీష్ రావులు చెప్పినట్లు రాష్ట్ర ప్రభుత్వం నడవదని పేర్కొన్న రేవంత్ రెడ్డి.. త్వరలోనే అన్ని పత్రాలను సభలో ప్రవేశపెడతానని స్పష్టం చేశారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం ఉన్న బకాయిలపై స్పందించిన ముఖ్యమంత్రి.. అవి కేసీఆర్ హయాం నుంచే ఉన్నాయని గుర్తు చేశారు. సింగరేణి బకాయిలను 10 ఏళ్లపాటు కేసీఆర్‌ను అడగకుండా.. ఇప్పుడు తనను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడుగుతున్నారని నిలదీశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి ఫోన్లను ట్యాప్ చేయడం లేదని స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి.. ట్యాప్ చేసి ఫోన్ సంభాషణలు వింటే ఆయుష్షు తగ్గుతుందని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసి ఇతరులు మాట్లాడిన కాల్స్ వినడం ఓ మానసిక రోగమని సెటైర్లు వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిగా అధ్యయనం చేయాలని పేర్కొన్న రేవంత్ రెడ్డి.. ఆ బాధ్యత ఒక నిపుణుల కమిటీకి అప్పగించినట్లు తెలిపారు. 3 గేట్ల మరమ్మతుల తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కూలితే.. దాన్ని తమపై వేయాలని బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *